కూత వినిపించేనా..?
బ్రిటిష్వారి కాలం నుంచే సాలూరు పట్టణ ప్రజలకు రైలు సేవలు అందేవి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, సిమెంట్ వంటివి ఇక్కడికే వచ్చేవి. గూడ్స్ ద్వారా వచ్చే సరకులను స్టేషన్ నుంచి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు లారీలు, ఇతర వాహనాల్లో ర
రైలుబస్సుకు నోచుకోని సాలూరు రైల్వే స్టేషన్
సాలూరు స్టేషన్లో నిలిచిన రైలు
సాలూరు, న్యూస్టుడే: బ్రిటిష్వారి కాలం నుంచే సాలూరు పట్టణ ప్రజలకు రైలు సేవలు అందేవి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, సిమెంట్ వంటివి ఇక్కడికే వచ్చేవి. గూడ్స్ ద్వారా వచ్చే సరకులను స్టేషన్ నుంచి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు లారీలు, ఇతర వాహనాల్లో రవాణా చేసేవారు. స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం ఉండేది. సాలూరు-బొబ్బిలి పట్టణాల మధ్య బొగ్గుతో నడిచే రైలు రాకపోకలు చేసేది. ప్రయాణికులు వందల సంఖ్యలో ప్రయాణించేవారు. పదుల సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు. వారి కోసం భవన సముదాయం కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అవన్నీ లేవు. 15 ఏళ్ల కిందట రైల్వేస్టేషన్ను ఎత్తేశారు. ఆ తరువాత రైలుబస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది కూడా రావడం లేదు. లాక్డౌన్ సమయంలో ప్రస్తుతం రైళ్లు నిలిపేందుకు ఈ స్టేషన్ను వినియోగిస్తుండటం గమనార్హం. అతి తక్కువ రవాణా ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు బొబ్బిలి పట్టణానికి వెళ్లి వచ్చేవారు. శివరాంపురం, రొంపల్లి, భవానీపురం, నారాయణప్పవలస తదితర గ్రామాల ప్రజలు, విద్యార్థులు నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించేవారు. రైలు సేవలు నిలిపివేయడంతో రోడ్డు మార్గాన్ని మాత్రమే వినియోగించాల్సిన దుస్థితి నేడు నెలకొంది.
షెడ్యూల్ ప్రకటించి..: పట్టణం నుంచి బొబ్బిలి మీదుగా విశాఖ వరకు పాసింజరు రైలు నడుపుతామని మూడేళ్ల కిందట ఎస్ఈ రైల్వే అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు స్టేషన్ను పరిశీలించారు. దండిగాం రోడ్డు వరకు లైన్ పొడిగించి రైలు సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.లక్షల నిధులు వెచ్చించి మరో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ లైన్ల పనులు చేయించారు. స్టేషన్ ఆధునికీకరణ, కొత్త షెడ్ ఏర్పాటు చేశారు. ఇదంతా జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా.. నేటికీ రైలు కూత మాత్రం వినిపించడం లేదు.
హామీలే తప్ప..: రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు జరిపించాక.. రైలు బస్సు పునరుద్ధరణతో పాటు గదులను అప్పటి అరకు ఎంపీ గీత ప్రారంభించారు. రిజర్వేషన్ కౌంటరు కూడా స్థానిక పోస్టాఫీసులో ఏర్పాటు చేయిస్తామన్నారు. వాటికి నేటికీ అతీగతీ లేదు. పట్టణ వినియోగదారుల మండలి సభ్యులు ఎంపీకి వినతులు సమర్పించారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రైలు నడపాలని కోరారు. పార్లమెంట్లో ప్రస్తావించి రైలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు కూడా వచ్చిన ప్రతిసారీ త్వరలోనే రైలు సేవలంటూ హామీలు ఇస్తున్నారు తప్ప..ఆచరణ కానివ్వడం లేదు.
పలుమార్లు కోరాం
రైలు సౌకర్యం కల్పిస్తే పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుంది. సాలూరు నుంచి బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ వెళ్లేవారికి రవాణాలో సమయంతో పాఉట ఛార్జీల భారం తగ్గుతుంది. నేతలు, అధికారులు పట్టించుకోవాలి.
-జె.సీతారాం, జిల్లా వినియోగ దారుల మండలి కార్యదర్శి, సాలూరు.
లేఖలు రాశా
పట్టణానికి రైలు సౌకర్యం కల్పించాలి. లేదంటే గతంలో ఉన్న రైలు బస్సు అయినా నడపాలని రైల్వే ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖలు రాశా. వారి నుంచి సమాధానం రావాలి. లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైలు సేవలు అందించాలని కోరుతాను.
-పి.రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
[ 26-04-2024]
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి
[ 26-04-2024]
ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. -
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..