నాటుగా.. పూటుగా
జిల్లాలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎస్ఈబీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. స్థానికంగా
చినమేరంగి ప్రాంతంలో సారా తయారీ బట్టీ
పార్వతీపురం పట్టణం, విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: జిల్లాలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలీసులు, మరోవైపు ఎస్ఈబీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఎక్కడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. స్థానికంగా తయారీ తక్కువే అయినప్పటికీ ఒడిశా రాష్ట్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పెరుగుదలకు కారణాలివీ..
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మద్యం ధరలను విపరీతం పెంచింది. దీంతో డబ్బులు లేక తక్కువ ధరకు లభించే సారాపై కొందరి దృష్టిపడింది. దీంతో అప్పటి వరకు కొంతమేర ఉన్న సారా విక్రయాలు ఒక్కసారిగా విస్తరించాయి. ముఖ్యంగా జిల్లాలోని పార్వతీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ తదితర ఏజెన్సీ మండలాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఒడిశా నుంచి అలమండ, కేదారపురం, కొమరాడ, పార్వతీపురం, సాలూరు తదితర మార్గాల మీదుగా సారా దిగుమతి అవుతోందని అధికారులు గుర్తించారు.
కానరాని చెక్పోస్టులు..
ఒడిశా నుంచి పార్వతీపురం డివిజన్లోకి ప్రధానంగా 11 మార్గాల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో చెక్పోస్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికి నాలుగు చోట్ల మాత్రమే పెట్టారు. దీంతో దిగుమతికి అడ్డుకట్ట పడడం లేదు.
85 శాతం ఒడిశా నుంచే..
గతంలో మారుమూల గ్రామాలు, శివారు, నిషేధిత ప్రాంతాల్లో నాటుసారా తయారు చేసేవారు. కానీ నేడు ఎక్కడికక్కడే బట్టీలు వెలుస్తున్నాయి. అయితే ప్రధానంగా ఒడిశా నుంచే ఎక్కువగా సారా వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు 85 శాతం దిగుమతి అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.
మళ్లీ వెనక్కి..
సారా విక్రయదారులు పట్టుబడితే అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి తక్కువ సమయంలోనే వారు బెయిల్పై బయటకు వస్తున్నారు. దీంతో విక్రయ, రవాణాదారుల్లో భయం లేకుండా పోతోంది. జిల్లాలో దొరికిన వారే మళ్లీ మళ్లీ పట్టుబడుతుండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే ఎస్ఈబీ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. నిత్యం కొంతమంది మాత్రమే దాడుల్లో పాల్గొంటున్నారు.
కఠిన చర్యలు.. సారా తయారీదారులు, తరలించే వ్యక్తులపై బైండోవరు కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1397 మందిని బైండోవరు చేశాం. ప్రతి ఆరునెలలకోసారి వారి కదలికలు, నడవడికను బట్టి వాటిని ఉంచాలా..? తొలగించాలా..? అనేది నిర్ణయిస్తాం. ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ యాక్టు ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక పోలీసులు, అబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్ బలగాలు దాడుల్లో పాల్గొంటున్నాయి. - ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ, ఎస్ఈబీ
జిల్లాలో ఇలా..
ఎస్ఈబీ ఏర్పాటైనప్పటి నుంచి నమోదైన కేసులు: 2,758
అరెస్టు అయినవారు: 1712 మంది
స్వాధీనం చేసుకున్న సారా: 87,197.5 లీటర్లు
సీజ్ చేసిన వాహనాలు: 629
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!