గుంకలాంలో సరే.. మిగిలిన చోట?
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో కొందరికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇది జరిగి ఏడాదైనా స్పష్టత లేదు. తాజాగా గృహాల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అటువంటి వారు 14,884 మంది
నిర్మాణంలో ఉన్న ఇళ్లు
విజయనగరం అర్బన్, మయూరికూడలి, న్యూస్టుడే: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో కొందరికి ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇది జరిగి ఏడాదైనా స్పష్టత లేదు. తాజాగా గృహాల నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అటువంటి వారు 14,884 మంది ఉన్నారు. వీరిలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద లేఅవుట్ అయిన గుంకలాంలో 11,091 ఇళ్లు మంజూరవ్వగా మూడో ఐచ్ఛికం వారికి ఒప్పంద (కాంట్రాక్టు) విధానంలో నిర్మించాలనుకున్నారు. ఇందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్వే చేయగా మూడు వేల మంది ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు, నిర్మాణ సంస్థ రాక్రీట్ ఏజెన్సీ మధ్య ఎంవోయూ(అవగాహన ఒప్పందం) పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు.
ప్రభుత్వం ఆర్థిక భారంతో లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవాలి అనడంపై వ్యతిరేకత రావడంతో మూడు ఐచ్ఛికాలను ప్రవేశపెట్టింది. సొంతంగా నిర్మాణం, ప్రభుత్వ సామగ్రితో కట్టుకోవడం, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం ఇందులో ఉన్నాయి. సొంత స్థలమున్న వారు కట్టుకునేందుకు ముందుకొచ్చారు. కొందరు సామగ్రి ఇవ్వాలని సుముఖత తెలియజేశారు. మిగిలిన వారు ఆర్థిక స్థోమత లేని కారణంగా ప్రభుత్వమే నిర్మించాలని రాతపూర్వకంగా తెలియజేశారు. వీరిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహించి ఏడాది కిందటే ప్రభుత్వానికి నివేదించారు. నిర్మాణాల కోసం ప్రతి 20 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో 10,420 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఐసీఐసీఐలో ఖాతా తెరవాలని లబ్ధిదారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తం లబ్ధిదారుల ఖాతా నుంచి నేరుగా మేస్త్రీ ఖాతాకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పనులు చేపట్టేందుకు 416 మంది తాపీమేస్త్రీలను గుర్తించారు. తర్వాత మరుగున పడింది.
అధికారి మాట..
గుంకలాంలో ముందుకొచ్చిన వారికి ఏజెన్సీ ద్వారా నిర్మిస్తాం. గతంలో మూడో ఐచ్ఛికం చెప్పిన వారిలో కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మిగిలిన వారి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
- ఎస్.రమణమూర్తి, పీడీ, గృహ నిర్మాణ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి
[ 26-04-2024]
ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. -
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్