విద్యార్థులు తెలుగు పదాలు చదవలేకపోతే ఎలా?
‘కనీసం తెలుగు పదాలను కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఇలా ఉంటే గిరిజన విద్యార్థులెలా బాగుపడతారు? ఈ పరిస్థితికి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలంటూ’ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అసంతృప్తి
ఎస్.కోట ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థితో తెలుగు పాఠ్యాంశం చదివిస్తున్న రవిబాబు
శృంగవరపుకోట, వేపాడ, న్యూస్టుడే: ‘కనీసం తెలుగు పదాలను కూడా సరిగా చదవలేకపోతున్నారు. ఇలా ఉంటే గిరిజన విద్యార్థులెలా బాగుపడతారు? ఈ పరిస్థితికి ఉపాధ్యాయులే బాధ్యత వహించాలంటూ’ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఎస్.కోట, వేపాడ మండలం కొండగంగుబూడిల్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పది, ఏడు తరగతుల విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. ఆంగ్లం కాదు కదా కనీసం తెలుగు పదాలు చదవలేకపోవడంతో ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి శనివారం సాయంత్రం గంట పాటు విద్యార్థులు భయం లేకుండా మాట్లాడటంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. మళ్లీ మూడు నెలల తర్వాత వస్తానని, అప్పటకి మార్పు తప్పకుండా కనిపించాలన్నారు. కేజీపూడి పాఠశాల స్టోర్ రూంలో నూనె, సెనగపప్పు పాడైపోవడాన్ని గమనించి, ఇలా ఉంటే నాణ్యమైన ఆహారం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కొర్రా రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రెండు నెలల్లో ఆధార్, జనన ధ్రువపత్రాలు .. రాష్ట్రంలో పర్యటించినప్పుడు గిరిజన విద్యార్థులకు ఆధార్, జనన ధ్రువపత్రాలు లేకపోవడాన్ని గుర్తించామని, వీరికి వాటిని రెండు నెలల్లో అందిస్తామని రవిబాబు తెలిపారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రత్యేక డ్రైవ్గా తీసుకొని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.