logo

విద్యుదాఘాతంతో వాహనాల దగ్ధం

విద్యుదాఘాతంతో స్కూటీ, బైక్‌ దగ్ధమైన ఘటన బుధవారం మధ్యాహ్నం లంకాపట్నం సమీపంలోని రైల్వే గేటు దగ్గర చోటు చేసుకుంది.

Published : 26 Jan 2023 02:07 IST

కాలిపోయిన స్కూటీ, బైక్‌

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో స్కూటీ, బైక్‌ దగ్ధమైన ఘటన బుధవారం మధ్యాహ్నం లంకాపట్నం సమీపంలోని రైల్వే గేటు దగ్గర చోటు చేసుకుంది. రైల్వే క్యాబిన్‌లో పనిచేసే ఆర్‌.వెంకటరావు, మనోహర్‌ తమ ఎలక్ట్రికల్‌ స్కూటీ, పల్సర్‌ బైక్‌లను పక్కన పార్కింగ్‌ చేసి విధులకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రెండూ దగ్ధమయ్యాయి. ఎలక్ట్రికల్‌ స్కూటీలో విద్యుదాఘాతంతో ఈ ఘటన జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి సోమేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని