విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలే
ఊహించని రీతిలో ములుగు జడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న కుసుమ జగదీశ్వర్ ప్రస్థానం అనతి కాలంలోనే ముగిసింది.
ములుగు జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్ మృతితో విషాదం
ములుగు, న్యూస్టుడే: ఊహించని రీతిలో ములుగు జడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న కుసుమ జగదీశ్వర్ ప్రస్థానం అనతి కాలంలోనే ముగిసింది. వరించిన పదవిని సంతృప్తిగా అనుభవించకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన కుసుమ జగదీశ్వర్(47) జీవిత చరిత్ర ఓ ప్రత్యేకత. కుసుమ ఆదినారాయణ - సులోచన దంపతులకు నలుగురు సంతానం. జగదీశ్వర్ రెండో వాడు. మల్లంపల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఆయనకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవాటయ్యాయి. ఇంటర్ పూర్తి చేసిన ఆయన 1991 నుంచి 1994 వరకు గ్రామంలో విశ్వ భారతి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, మల్లంపల్లి సమీప గ్రామాల్లో యువతను కూడగట్టి గుట్కా, గుడుంబా నిషేధం తదితర కార్యక్రమాలు చేయడం, వ్యవసాయ సాగులో రైతులకు శాస్త్రవేత్తలతో శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేసేవారు. మావోయిస్టు అనుబంధ తెలంగాణ జనసభలో కొంతకాలం ములుగు ఇన్ఛార్జిగా పనిచేశారు.
ఉద్యమ సమయంలో చురుగ్గా..
హైదరాబాద్ వెళ్లిన ఆయన, అదే సమయంలో ఆవిర్భవించిన తెరాసలో చేరారు. యువజన విభాగంలో పని చేస్తూ.. ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో తెరాస అభ్యర్థి విజయం కోసం పని చేశారు.
ఏటూరునాగారం జడ్పీటీసీ అభ్యర్థిగా
జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు వినతిపత్రం ఇచ్చిన జగదీశ్వర్(పాతచిత్రం)
పార్టీ ఇచ్చిన అవకాశంతో 2019 మే నెలలో తెరాస అభ్యర్థిగా ఏటూరునాగారం జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేశారు. గెలుపొందిన ఆయనకు పార్టీ జడ్పీ ఛైర్మన్గా అవకాశం కల్పించింది. అదే ఏడాది ఆగస్టు 7న జడ్పీ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తెరాస ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి, జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా పార్టీ అప్పగించింది. నిరంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను ప్రోత్సహిస్తూ.. పార్టీని ముందుకు నడిపించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మల్లంపల్లిని మండలం చేయాలని..
స్వగ్రామమైన మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేయాలనేది ఆయన లక్ష్యం. సుమారు మూడేళ్ల నుంచి ఆయన మండలం కోసం శ్రమిస్తున్నారు. మండలం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో స్థానికులు, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ములుగులో నిర్వహించిన బహిరంగ సభలో మల్లంపల్లి మండలం ప్రస్తావన తీసుకొచ్చి కేటీఆర్కు వినతిపత్రం కూడా అందించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని గ్రామాలకు సీసీ రోడ్లు మంజూరు చేయించారు. ఏటూరునాగారంలో జడ్పీ క్యాంపు కార్యాలయం మంజూరు చేయించగా, అది నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండేళ్లుగా వర్షాకాలంలో ములుగు జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలు, వరదలతో గ్రామాల్లో నష్టం జరిగిన సమయంలో ఆయన స్వయంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై వరద సహాయక కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు కేటీఆర్ రాక
ములుగు, న్యూస్టుడే: జగదీశ్వర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మల్లంపల్లిలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. అంత్యక్రియలకు భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 8.45 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 9 గంటలకు బేగంపేట చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్లంపల్లి చేరుకొని జడ్పీ ఛైర్మన్ అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొంటారు.
కటతడి పెట్టిన మంత్రి సత్యవతి రాథోడ్
కుటుంబ సభ్యులు, అభిమానులు జగదీశ్వర్ మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణ వార్త దావానలంలా వ్యాపించింది. బంధువులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో మల్లంపల్లికి చేరుకొని విలపించారు. మంత్రి సత్యవతి రాథోడ్ జగదీశ్వర్ మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించి కంటతడి పెట్టారు. జడ్పీ ఛైర్మన్ తల్లి సులోచన తన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. రోదిస్తుండటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
మంచి మిత్రుడిని కోల్పోయాం : షాపూరి మహేందర్, మల్లంపల్లి
ఓ మంచి మిత్రుడిని కోల్పోయాం. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మల్లంపల్లిలోనే కలిసి చదువుకున్నాం. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎలాంటి మార్పు రాలేదు. మాతో చాలా సన్నిహితంగా ఉండే వాడు. నిజం చెప్పాలంటే ఆయన నిగర్వి.
ప్రతి పనిలో పట్టుదలే : తుమ్మనపెల్లి కిరణ్
జగదీశ్వర్ మేము మంచి స్నేహితులం. కలిసి చదువుకున్నాం. ఆయన ఏ పని చేపట్టినా పట్టుదలతో చేసే వారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఇష్టం. మృతి మాకు బాధ కలిగిస్తోంది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయామనే బాధ వెంటాడుతోంది.
పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాం : ల్యాద సాంబరాజు
జడ్పీ ఛైర్మన్గా ఎన్నికైన తర్వాత చదువుకున్న వాళ్లమంతా కలవాలని పదే పదే చెప్పేవారు. అనుకున్నట్లుగానే మల్లంపల్లి పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంబరపడ్డాం. జగదీశ్వర్ లేడనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
[ 02-05-2024]
నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. -
గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ రోడ్షో
[ 02-05-2024]
మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. -
మన అభ్యర్థులంతా బంగారు కొండలే..!
[ 02-05-2024]
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే పండగలు, పెళ్లిళ్లు, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా పసిడి కొనుగోలు చేసేందుకు అమితంగా ఇష్టపడతారు. తమ ధగధగల నగలను ఎదుటి వారికి చూపేందుకు ఇష్టపడతారు. ఇందుకు లోక్సభ బరిలో ఉన్న మన అభ్యర్థులు అతీతమేం కాదు. -
‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
[ 02-05-2024]
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. -
దేశం గర్వించేలా మోదీ పాలన
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ పర్యవేక్షణ
[ 02-05-2024]
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి, జిల్లా విద్యాశాఖ ప్రణాళికబద్ధంగా నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలాంటి పటిష్ఠ చర్యలతో ఈ విద్యాసంవత్సరం (2023-24)లో జిల్లా పదోతరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. -
ఎండు గంజాయి పట్టివేత
[ 02-05-2024]
ఓ వ్యక్తి వద్ద ఎండు గంజాయి పట్టుకున్న ఘటన డోర్నకల్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెలువరించారు. -
‘మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, భారాస ప్రయత్నం’
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భాజపా, భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొని మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల నిర్వహణ మానిటరీ కమిటీ కో-ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. -
బాలలతో పని చేయించడం నేరం
[ 02-05-2024]
14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. -
పంచాయతీలకు గూడు కరవు..!
[ 02-05-2024]
జిల్లా పరిధిలో మంజూరైన భవనాల్లో ములుగు, వెంకటాపూర్ మండలాల్లోనే ఏడు పనులు పూర్తి కాగా, 34 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో అందకపోవడంతో గుత్తేదారులు అర్థాంతరంగా వదిలేశారు. ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి కానున్నాయి. -
సైబర్ మోసాల నియంత్రణకు కృషి
[ 02-05-2024]
జిల్లాలో సైబర్ సెక్యూరిటీ కేసులను చేదించే దిశగా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని (ములుగు జిల్లా కోఆర్డినేషన్ సెంటర్) ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్ వర్సిటీలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కార్మిక పక్షపాతి కేసీఆర్
[ 02-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. -
భానుడి భగభగలు..
[ 02-05-2024]
జిల్లాలో ఏప్రిల్ మాసం మొదటి నుంచే వేసవి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మే నెల ప్రారంభం కావడంతో బుధవారం నుంచే భానుడు మండుతున్నాడు. -
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
[ 02-05-2024]
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ చాటారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 28 వరకు గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. -
పైసలిస్తేనే దస్త్రం కదిలేది!
[ 02-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు మారడం లేదు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పైసలిస్తే సరి.. లేదంటే కొర్రీలు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. -
విజ్ఞానం.. వినోదం.. ఆధ్యాత్మికం
[ 02-05-2024]
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.. విద్యార్థులకు ఉపశమనం లభించింది. తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే వరకు ఈ వేసవి సెలవులను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలి. -
71,245 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
[ 02-05-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటుంటాం. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద దరావతు (డిపాజిట్) చేయాల్సి ఉంటుంది. -
రెండు నియోజకవర్గాలకు రహదారే సరిహద్దు
[ 02-05-2024]
ఈ చిత్రంలో ఉన్నది ఒకే గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి జంట గ్రామాలు. మధ్యలో సరిహద్దుగా ఉన్న సీసీ రోడ్డు.. రెండు పంచాయతీలు, రెండు జిల్లాలు, రెండు శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలను వేరు చేస్తోంది. -
ఉద్యోగాల పేరుతో టోకరా కేసు.. మరో నిందితుడి అరెస్టు
[ 02-05-2024]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో హనుమకొండ సుబేదారి పోలీసులు మరో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్