శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
‘మండుటెండను లెక్క చేయకుండా అలుపు, సొలుపు లేకుండా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన
న్యూస్టుడే, కార్పొరేషన్, వరంగల్ కలెక్టరేట్, శివనగర్, రంగశాయిపేట, పోచమ్మమైదాన్, ములుగురోడ్డు, : ‘మండుటెండను లెక్క చేయకుండా అలుపు, సొలుపు లేకుండా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 8.20 గంటల వరకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన సాగింది. మొత్తం 16 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు రూ.1745 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట కాకతీయ మెగా వస్త్ర నగరి నుంచి వరంగల్ అజంజాహి మిల్లు మైదానంలో నిర్వహించిన భారాస బహిరంగ సభ వరకు మంత్రి కేటీఆర్ పర్యటన సాగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం గులాబీమయమైంది. అడుగడుగునా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలు దర్శనమిచ్చాయి.
నిర్వాసితులకు పట్టాలు
తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.3,800 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, శనివారం ఒకేరోజు రూ.618కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని ఎమ్మెల్యే నరేందర్ వెల్లడించారు. బహిరంగ సభలో నరేందర్ మాట్లాడుతూ 43 మురికివాడల్లోని భూనిర్వాసితులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకే దక్కుతుందన్నారు. లేబర్కాలనీ ప్రాంతంలో 90శాతం పేదప్రజలు నివసిస్తారనని, అలాంటి చోట నూతన కలెక్టరేట్ నిర్మాణంతో వారికి ఉపాధి అవకాశాలతో పాటు భూముల ధరలు రెట్టింపవుతాయన్నారు.
మంత్రి పర్యటన ఇలా సాగింది..
ఉదయం 10.15: హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా కాకతీయ మెగా వస్త్ర నగరి వద్దకు మంత్రి కేటీఆర్ రాక.
10.49: యంగ్ వన్ కంపెనీకి శిలాఫలకం, భూమి పూజ.
11.55: రోడ్డు మార్గంలో వరంగల్కు బయలు దేరారు.
మధ్యాహ్నం 12.52: వరంగల్ ఓసిటీలోని తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భవనం వద్దకు చేరిక.
1.10: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం. సుమారు గంటన్నర పాటు మంత్రి కేటీఆర్ ఇక్కడే ఉండి ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.
2.30: అజంజాహి మిల్లు మైదానంలో వరంగల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేటు భవన నిర్మాణానికి శంకుస్థాపన.
2.56: జర్నలిస్టులకు నిర్మించిన రెండు పడకల ఇళ్ల ప్రారంభం. ఇక్కడే ఐడీసీˆ వసతి గృహానికి శంకుస్థాపన.
3.20: కొత్తవాడ గోపాలస్వామి గుడిలో దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ, చేనేత కార్మికుల విగ్రహావిష్కరణ
సాయంత్రం 4.00 బల్దియా ప్రధాన కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పైలాన్ ఆవిష్కరణ
4.15: మండిబజారు ఈద్గా, దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
4.25: వరంగల్ చౌరస్తా కూడలిలో స్మార్ట్ రోడ్లు ప్రారంభం.
4.35: వరంగల్ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
4.55: ఖమ్మంరోడ్ రోటరీ క్లబ్ ముందు వరంగల్ తూర్పు సోషల్ మీడియా కార్యాలయం ప్రారంభం.
5.10: రంగశాయిపేట నాయుడు పంపు కూడలిలో ఇన్నర్ రింగురోడ్డు పనులకు శంకుస్థాపన
5.15: ఉర్సు రంగసముద్రం వద్ద మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం ప్రారంభోత్సవం, ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఉర్సు చెరువు సుందరీకరణ, కల్చరల్ కన్వెన్షన్ సెంటర్, తాగునీటి పైపులైన్లు, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
5.35: ఉర్సు దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, దర్గాలో ప్రార్థనలు
6.05: రంగశాయిపేటలో ‘కుడా’ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
6.30: ఫసాడ్ లైటింగ్ ప్రారంభోత్సవం. అనంతరం గంటపాటు ఖిలావరంగల్ కోటలో రాతి, మట్టి కోట విశేషాలు, ఇతర అభివృద్ధి పనులు తెెలుసుకొని టీ, స్నాక్స్ తీసుకున్నారు.
రాత్రి 7.30: వరంగల్ అజంజాహి మిల్లు మైదానంలో జరిగిన భారాస బహిరంగ సభ వేదికకు చేరిక.
8.20 వరకు సమావేశంలో పాల్గొన్నారు.
8.30: రోడ్డు మార్గంలో హైదరాబాద్ పయనం.
కాకతీయ మెగా వస్త్రపరిశ్రమలో యంగ్వన్ సంస్థ యూనిట్కు శంకుస్థాపన చేసిన అనంతరం సంస్థ ఛైర్మన్ కిహాక్సంగ్కు ఒప్పంద పత్రాలను అందజేస్తున్న మంత్రి కేటీఆర్, పక్కన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్, ఎండీ నరసింహారెడ్డి, తదితరులు
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి భూమిపూజ చేస్తున్న మంత్రి కేటీఆర్, పాలనాధికారి ప్రావీణ్య, ఎమ్మెల్యే నరేందర్ తదితరులు
దేశాయిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తూ..
కొత్తవాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ..
సభకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
[ 02-05-2024]
నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఉపన్యాసాలను పరిశీలిస్తే అంశం ఒకటే అయినా వారు వెల్లడించే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 24న హనుమకొండ మడికొండలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గత ఆదివారం వరంగల్ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఒకే అంశంపై చేసిన విమర్శలు విభిన్నంగా ఉన్నాయి. -
గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ రోడ్షో
[ 02-05-2024]
మానుకోటలో జై తెలంగాణ నినాదాలు మరోసారి మిన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనాడు పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జై తెలంగాణ నినాదాలు దారి పొడవునా మార్మోగాయి. -
మన అభ్యర్థులంతా బంగారు కొండలే..!
[ 02-05-2024]
భారతీయులందరికీ బంగారం అంటే ఎంతో మక్కువ. అందుకే పండగలు, పెళ్లిళ్లు, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా పసిడి కొనుగోలు చేసేందుకు అమితంగా ఇష్టపడతారు. తమ ధగధగల నగలను ఎదుటి వారికి చూపేందుకు ఇష్టపడతారు. ఇందుకు లోక్సభ బరిలో ఉన్న మన అభ్యర్థులు అతీతమేం కాదు. -
‘బాలరాముడి పేరుతో భాజపా రాజకీయం’
[ 02-05-2024]
అయోధ్యలో రామాలయం పేరుతో ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వరంగల్ జిల్లా ఓసిటీ(ఓరుగల్లు సిటీ)లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. -
దేశం గర్వించేలా మోదీ పాలన
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పర్వతగిరి, ఏనుగల్లు గ్రామాల్లో కార్నర్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. -
ప్రత్యేక కార్యాచరణ.. పటిష్ఠ పర్యవేక్షణ
[ 02-05-2024]
జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి, జిల్లా విద్యాశాఖ ప్రణాళికబద్ధంగా నిరంతరం పర్యవేక్షణ, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలాంటి పటిష్ఠ చర్యలతో ఈ విద్యాసంవత్సరం (2023-24)లో జిల్లా పదోతరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. -
ఎండు గంజాయి పట్టివేత
[ 02-05-2024]
ఓ వ్యక్తి వద్ద ఎండు గంజాయి పట్టుకున్న ఘటన డోర్నకల్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెలువరించారు. -
‘మత ఘర్షణలు సృష్టించేందుకు భాజపా, భారాస ప్రయత్నం’
[ 02-05-2024]
కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భాజపా, భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొని మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నియోజకవర్గాల లోక్సభ ఎన్నికల నిర్వహణ మానిటరీ కమిటీ కో-ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి ఆరోపించారు. -
బాలలతో పని చేయించడం నేరం
[ 02-05-2024]
14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. -
పంచాయతీలకు గూడు కరవు..!
[ 02-05-2024]
జిల్లా పరిధిలో మంజూరైన భవనాల్లో ములుగు, వెంకటాపూర్ మండలాల్లోనే ఏడు పనులు పూర్తి కాగా, 34 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు సకాలంలో అందకపోవడంతో గుత్తేదారులు అర్థాంతరంగా వదిలేశారు. ఉన్నతాధికారులు చొరవ చూపితేనే పనులు పూర్తి కానున్నాయి. -
సైబర్ మోసాల నియంత్రణకు కృషి
[ 02-05-2024]
జిల్లాలో సైబర్ సెక్యూరిటీ కేసులను చేదించే దిశగా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ క్రైం నియంత్రణలో భాగంగా బుధవారం ములుగులో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కార్యాలయాన్ని (ములుగు జిల్లా కోఆర్డినేషన్ సెంటర్) ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం హనుమకొండలోని చైతన్య డీమ్డ్ వర్సిటీలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఏపీవోలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
కార్మిక పక్షపాతి కేసీఆర్
[ 02-05-2024]
మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ కార్మిక పక్షపాతి అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. -
భానుడి భగభగలు..
[ 02-05-2024]
జిల్లాలో ఏప్రిల్ మాసం మొదటి నుంచే వేసవి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక మే నెల ప్రారంభం కావడంతో బుధవారం నుంచే భానుడు మండుతున్నాడు. -
ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు
[ 02-05-2024]
జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల విద్యాలయాల విద్యార్థులు పదో తరగతిలో ప్రతిభ చాటారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 28 వరకు గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. -
పైసలిస్తేనే దస్త్రం కదిలేది!
[ 02-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు మారడం లేదు. భవన నిర్మాణ అనుమతుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పైసలిస్తే సరి.. లేదంటే కొర్రీలు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. -
విజ్ఞానం.. వినోదం.. ఆధ్యాత్మికం
[ 02-05-2024]
పదోతరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.. విద్యార్థులకు ఉపశమనం లభించింది. తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే వరకు ఈ వేసవి సెలవులను విద్యార్థులను సద్వినియోగం చేసుకోవాలి. -
71,245 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
[ 02-05-2024]
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటుంటాం. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద దరావతు (డిపాజిట్) చేయాల్సి ఉంటుంది. -
రెండు నియోజకవర్గాలకు రహదారే సరిహద్దు
[ 02-05-2024]
ఈ చిత్రంలో ఉన్నది ఒకే గ్రామంగా కనిపిస్తున్నప్పటికీ ఇవి జంట గ్రామాలు. మధ్యలో సరిహద్దుగా ఉన్న సీసీ రోడ్డు.. రెండు పంచాయతీలు, రెండు జిల్లాలు, రెండు శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలను వేరు చేస్తోంది. -
ఉద్యోగాల పేరుతో టోకరా కేసు.. మరో నిందితుడి అరెస్టు
[ 02-05-2024]
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో హనుమకొండ సుబేదారి పోలీసులు మరో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్