గొర్రెల పంపిణీకి మంగళం!
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు
న్యూస్టుడే, భూపాలపల్లి: గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా చోట్ల గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా తాము చెల్లించిన డీడీలు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. చివరకు స్థానిక అధికారులపై గొర్రెల పెంపకందారుల సంఘాలు, నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అడిగిన వాళ్లందరి డీడీలు వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గత భారాస ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల యూనిట్ల కోసం చాలా మంది దరఖాస్తు చేశారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.43,750 చెల్లించాలి. మిగతా మొత్తం ప్రభుత్వం రాయితీ కింద భరించి గొర్రెలను పెంపకందారులకు అందజేస్తుంది. ఒక్కో యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. మొదటి విడత కింద 2018లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6,722 యూనిట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8.94 కోట్లు ఖర్చు చేసింది. 2019లో రెండో విడతగా 5,784 యూనిట్ల వరకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కొరత కారణంగా పథకం ముందుకు సాగలేదు. దాదాపుగా 796 మంది గొర్రెల పెంపకందారులు ఒక్కొక్కరు రూ.43,750 చొప్పున ప్రభుత్వానికి డీడీలు చెల్లించారు. ఇందులో 395 యూనిట్లకు గొర్రెలు పంపిణీ చేశారు. మిగతా 401 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది. నాలుగేళ్లవుతున్నా గొర్రెలు పంపిణీ చేయకపోవటంతో డీడీలు చెల్లించిన వాళ్లంతా ఆశలు వదులుకున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని వేచిచూశారు. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులు ఈ పథకం అమలుపై విచారణ చేపట్టడంతో పలు అక్రమాలు వెలుగు చూశాయి. పథకం ఇక కొనసాగే అవకాశాలు లేవని గ్రహించిన రాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు డీడీల సొమ్ము వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు లబ్ధిదారులు కూడా కొద్ది రోజులుగా ఆ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి శ్రీదేవిని వివరణ కోరగా.. డీడీలు లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ఇంకా ఆదేశాలు రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఉత్తర్వులు జారీ అయితే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.