మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది.
కృషి చేస్తే యునెస్కో గుర్తింపు సైతం దక్కే అవకాశం..
అభ్యర్థులపైనా గురుతర బాధ్యత
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, ఈనాడు, మహబూబాబాద్: ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగుతున్నాయి.. మహబూబాబాద్ పరిధిలోని ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లో మేడారం జాతర వస్తుంది. అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధించినా గిరిజన జాతరకు జాతీయ హోదా.. యునెస్కో గుర్తింపు తీసుకురావాలని ఉమ్మడి వరంగల్ వాసులు కోరుతున్నారు.
ఏళ్లుగా ప్రయత్నాలు..
ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించే మహాజాతరకు కోటి మందికి పైగా తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఎంతో ప్రాశస్త్యం, విశిష్ఠత కలిగిన జాతరకు జాతీయ హోదా ప్రయత్నం ఏళ్లుగా సాగుతోంది. 2008 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 2018 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ.. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళుతోంది. మన ఎంపీలు అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నారు.
ఇంటాంజిబుల్ విభాగంలో .
కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. అశేష భక్తజనం తరలివచ్చే మేడారం జాతరకూ ఇంటాంజిబుల్ విభాగంలో ఈ అరుదైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండగలు, విశ్వాసాలు, కళలు, నైపుణ్యాలు, ఇతర ప్రత్యేకతలను వారసత్వ సంపదగా గుర్తించి భావితరాలకు అందించేందుకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చి వీటి పరిరక్షణకు పాటుపడతారు.
అభివృద్ధికి ఆస్కారం..
మేడారం మహాజాతర రాష్ట్ర పండగగా ఉమ్మడి రాష్ట్రంలోనే 1996లో గుర్తించారు. ఉత్తర భారతంలో జరిగే కుంభమేళాకు జాతీయ పండగ హోదా కల్పించడంతో నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ హోదా మేడారానికి వస్తే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించొచ్చు. యునెస్కో గుర్తింపు దక్కితే జాతర వైభవం ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. భావితరాలకు అందుతుంది.
ప్రత్యేక శ్రద్ధ వహిస్తా
-అజ్మీరా సీతారాంనాయక్, భాజపా అభ్యర్థి
గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు రామప్ప వద్ద పలు అభివృద్ధి పనులు చేశాం. ఈసారి సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను
- మాలోత్ కవతి, భారాస అభ్యర్థి
మేడారానికి జాతీయహోదా దక్కేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను. రామప్పలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తాను.
అది మన హక్కు..
- పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్ అభ్యర్థి
మేడారానికి జాతీయ హోదా మన హక్కు.. ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ చేర్చాం. రామప్ప అభివృద్ధికి కూడా చొరవ చూపుతాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు