వేసవి తాపం.. మారిన షిఫ్టు సమయం
ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.
న్యూస్టుడే, భూపాలపల్లి
ఉపరితల గని
ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతోంది. కాగా ఈ సమయాలను ఉదయం 6 నుంచి 12కు, మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు మార్చారు. దీన్ని యాజమాన్యం సోమవారం నుంచి అమలులోకి తీసుకురానుంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఉపరితల గనుల్లో పనిచేసే ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. ముఖ్యంగా ఉదయం, రెండో షిఫ్టు విధులు నిర్వహించే కార్మికులు విధులు నిర్వహించలేమని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 19 ఉపరితల గనుల్లో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆపరేటర్లతో పాటు కేబుల్బాయ్లు, సాంకేతిక సిబ్బంది ఉపరితల గని క్వారీల్లో పనిచేయాల్సి ఉండటంతో ఎండ వేడికి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో రోజూ 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉపరితల గని క్వారీల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉద్యోగులు ఈ గనుల్లో పనిచేసేందుకు దూరంగా ఉంటున్నారు. కాగా బొగ్గు ఉత్పత్తిపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది.
కార్మికుల్లో అసంతృప్తి : షిఫ్టు వేళలు మార్చినా మార్చినా పని గంటలు మాత్రం యథావిధిగా ఉన్నాయని కార్మికుల్లో అసంతృప్తి నెలకొంది. సాధారణంగా ప్రతి షిఫ్టునకు 8 గంటల పని దినం కింద లెక్కిస్తారు. ప్రస్తుతం యాజమాన్యం పని సమయాలు మార్పు చేసినా.. 8 గంటల పనిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు విధుల్లోకి చేరిన తర్వాత మధ్యలో గంట విరామం ఉంటుంది. భోజన సమయం కింద గంట పాటు విశ్రాంతి ఇస్తారు. ఈ సమయాన్ని భోజనానికి వినియోగించకుండా విధుల్లో చేరింది మొదలు విరామం లేకుండా పని చేస్తామని ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే