చేసింది కొంత.. చేయాల్సింది కొండంత
‘2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది.
గ్రేటర్ పాలక వర్గానికి నేటితో మూడేళ్లు పూర్తి
కార్పొరేషన్, న్యూస్టుడే
అభివృద్ధి పనులు చేపట్టాలని మేయర్ సుధారాణికి వినతిపత్రం ఇస్తున్న కార్పొరేటర్లు (పాతచిత్రం)
‘2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’
వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. తమ డివిజన్లలో అనుకున్నంత అభివృద్ధి పనులు చేయలేక పోయామని పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వాపోతున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పాలకవర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని కార్పొరేటర్లు అంటున్నారు.
ముగ్గురు కమిషనర్లు బదిలీ
ఈ మూడేళ్లలో ముగ్గురు ఐఏఎస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తొలుత ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి, తర్వాత ఐఏఎస్ అధికారిణి ప్రావీణ్య, ఐఏఎస్ అధికారి రిజ్వాన్ బాషా జిల్లా కలెక్టర్లుగా పదోన్నతులపై వెళ్లారు. మూడేళ్లలో ఏడాదికొక కమిషనర్ మారడంతో నగరాభివృద్ధి దశ, దిశ లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.
పొంచి ఉన్న అవిశ్వాస ముప్పు
పాలకవర్గం మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో మేయర్, ఉప మేయర్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. ప్రస్తుతం మేయర్ సహా మెజార్టీ భారాస కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్లో చేరారు. దీంతో అవిశ్వాసం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరంగల్లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మేయర్గా సుధారాణి కొనసాగుతారని ప్రకటించారు. కొంత మంది కార్పొరేటర్లు మాత్రం లోక్సభ ఎన్నికల తర్వాత అవిశ్వాసం నోటీసు ఇస్తామంటున్నారు.
కాగితాల్లోనే అభివృద్ధి..
- నగరంలోని 66 డివిజన్లలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగాయి. ఒక్కో డివిజన్లో సుమారు రూ.2-6 కోట్ల పనులు ప్రతిపాదించారు. చాలా డివిజన్లలో పనులు మధ్యలో ఆగిపోయాయి. జనరల్ఫండ్స్, పట్టణ ప్రగతి, ఇతర గ్రాంట్ల రూపేణా సుమారు రూ.950 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో అన్ని కలిపి రూ.450 కోట్ల పైచిలుకు పనులు పూర్తయ్యాయి.
- స్మార్ట్సిటీ పథకం ద్వారా రూ.986 కోట్లతో 37 పనులు ప్రతిపాదించగా, ఇందులో 20 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.
- గత భారాస ప్రభుత్వ హయాంలో శాసనసభ ఎన్నికల ముందు రూ.650 కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఆ పనులన్నీ నిలిపివేశారు.
సాధించిన విజయాలు
- స్మార్ట్సిటీ, హృదయ్ పథకం నిధులతో భద్రకాళి బండ్ పూర్తయింది.
- వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 22 స్మార్ట్ రోడ్లు, 16 జంక్షన్లు అభివృద్ధి చెందాయి.
- హనుమకొండ 57వ డివిజన్ వాజ్పాయ్ కాలనీలో మోడల్ వైకుంఠధామం ప్రారంభించారు.
- వరంగల్ రంగంపేటలో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని స్మార్ట్ లైబ్రరీగా, బాలసముద్రం జిల్లా గ్రంథాలయాన్ని ముస్తాబు చేశారు.
- వరంగల్ పోతననగర్లో ఆధునిక చెత్త రవాణా కేంద్రం, ఆధునిక దోబీఘాట్ ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే