ఎన్నికల వేళ.. మద్యం జోరు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు.
వరంగల్క్రైం, న్యూస్టుడే
అనుమతి లేకుండా విక్రయిస్తున్న దుకాణంపై దాడి చేసి పోలీసులు పట్టుకున్న మద్యం (పాత చిత్రం)
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. డబ్బు, మద్యం తదితర వాటిపై సామాన్య ప్రజలకు ఆశ చూపి ఓట్లు రాబట్టుకునేందుకు నాయకులు విఫల యత్నం చేస్తారు. సాధారణ సమయంలో కంటే ఎన్నికల సమయంలో మద్యం రవాణా అధికమవుతుంది. దీనిపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. అభ్యర్థులు వెంట తిరిగే కార్యకర్తలకు అవసరమైన మద్యం, భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. నాటుసారాతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మద్యం సైతం విక్రయిస్తుంటారు. వీటికి తోడు గ్రామాల్లోని గొలుసు దుకాణాల్లో 24 గంటలు విక్రయాలు జరుగుతాయి. అక్రమ రవాణా నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ తనిఖీలు చేస్తున్నా ఆగడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, గొలుసు దుకాణాలు, సారాయిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
ఎన్నికలపై ప్రభావం
ఎన్నికల్లో ఓటరుపై మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం గొలుసు దుకాణాల్లో క్రయవిక్రయాలపై టాస్క్ఫోర్స్ విభాగం పోలీసులు, స్థానిక పోలీసులు, ఆబ్కారీ పోలీసుల నిఘా ఉంటుంది. ఇదే సమయంలో గతేడాది ఎంత మద్యం కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎంత చేశారు అనే లెక్కల వివరాలను ఎక్సైజ్ పోలీసులు తీసుకుంటారు. గతంలో కంటే అధిక మొత్తంలో మద్యం విక్రయాలు జరిగితే నిఘాను పెంచుతారు. దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పట్టుబడిన వారిని ముందుగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘిస్తే జైలుకు పంపించడం లేదా భారీగా జరిమానా విధిస్తున్నారు.
మద్యంపై ప్రత్యేక నిఘా..
- సీపీ అంబర్కిషోర్ఝా
ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణా, మత్తుపదార్థాలు, నాటు సారా రవాణా, తయారీపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎవరైనా విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే సీ-విజిల్ యాప్ లేదా ఇతర మార్గాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే