మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
నర్సంపేట బహిరంగ సభలో మాట్లాడుతున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి,
పక్కన ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్. వేదికపై మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు,
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు,
పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, అధికార ప్రతినిధి
రాణి రుద్రమరెడ్డి, నాయకులు రాణా ప్రతాప్, ప్రతాప్, తదితరులు
నర్సంపేట, నర్సంపేట గ్రామీణం, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భాజపా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మహబూబాబాద్ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ను గెలిపించాలని
కోరుతున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఐదు నెలల్లోనే పదేళ్ల వ్యతిరేకత
పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది మోదీ ప్రభుత్వమేనని.. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి.. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని అన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రసంగిస్తూ.. రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడంతో ఐదు నెలల్లో ఆ పార్టీపై పదేళ్ల వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని తేలడంతో రిజర్వేషన్లను రద్దు చేస్తారని సీˆఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారడి మాటలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ లోక్సభ ఇన్ఛార్జి ముస్కు శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వర్రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, ములుగు అసెంబ్లీ సెగ్మెంటు ప్రభారి నరోత్తమరెడ్డి, రాష్ట్ర నాయకుడు కుసుమ సతీశ్ తదితరులు మాట్లాడారు.
సభకు భారీగా హాజరైన జనం
విశేషాలు..
- జనసభకు వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. పార్టీ శ్రేణులు తీసుకొచ్చిన మజ్జిగ, మంచినీటి పొట్లాల కోసం ప్రజలు ఎగబడ్డారు.
- పుష్కర్సింగ్ ధామి హిందీలో ప్రసంగించారు. నాయకులెవరూ ప్రసంగాన్ని తెలుగులోకి తర్జుమా చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు.
- మహిళలు, యువకులు కమలం, మోదీ చిత్రాలతో కూడిన టోపీలను ధరించారు
- జనసభ ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లేవారు ఎండ వేడి తట్టుకోలేక మోదీ కటౌట్లను నెత్తిపై నీడగా పట్టుకొని వెళ్లారు.
హెలికాప్టర్కు జెండాతో వీడ్కోలు !
ఈ చిత్రం చూస్తే.. ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్కు టాటా చెబుతూ జెండాతో వీడ్కోలు పలుకుతున్నట్టు ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం భాజపా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి పాల్గొన్నారు. ఆయన హెలికాప్టర్లో తిరిగి వెళుతుండగా ప్రజలు జెండా ఊపుతుండగా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యమిది.
ఈనాడు, హనుమకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు