ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే.
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని వైద్యం కోసం ముందుగా ఈ ఆసుపత్రికే తీసుకొస్తుంటారు. కానీ ట్రామాకేర్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి సదుపాయాలు ఇక్కడ లేకపోవడంతో క్షతగాత్రుడికి ఏమైందో తెలియని దుస్థితి. అలాంటి సమయంలో ఎలాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తుండటం పరిపాటిగా మారింది. గంటల కొద్దీ సమయం ఇక్కడే వృథాకావడంతో సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు ఆవిరవుతున్నాయి.
ఆసుపత్రుల అభివృద్ధి విషయంలో వైకాపా నేతల మాటలు కోటలు దాటుతుంటాయి. వాస్తవంలోకి వెళ్తే పెద్దాసుపత్రుల్లో సైతం కనీస వైద్యం అందని పరిస్థితి. ఇక అత్యవసర వైద్య సేవలంటే అగమ్యగోచరమే.అయిదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధిని గాలికొదిలేసింది. అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడం పక్కన పెడితే ఒక్కో సమయంలో రోగులకు మందులు ఇవ్వలేని స్థితిలో ఉండటం గమనార్హం.
గర్భిణులకు వైద్యం అందించేందుకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రత్యేక గదులే లేకుండా పోయాయి. పదుల సంఖ్యలో గంటల తరబడి నిలబడి వైద్యుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాతాశిశువులకు వైద్యం అందించడానికి ప్రత్యేకంగా చేపట్టిన భవన నిర్మాణాలు ఐదేళ్లుగా సా..గుతూనే ఉన్నాయి.
ఆసుపత్రి పరిధిలో సంచార వైద్యం కోసం కేటాయించిన వాహనమిది. అయిదేళ్లుగా ఆసుపత్రి ప్రాంగణంలోనే నిలిపేశారు. గతంలో వీటిపై గ్రామాలకు వెళ్లి పలు రకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించేవారు.
నిత్యం వంద మందికిపైగా గర్భిణులు, బాలింతలు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?
[ 02-05-2024]
పాలకొల్లు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్కు 10 రోజులు మాత్రమే ఉండటంతో ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ జమానాలో దగా పడ్డ కౌలురైతు
[ 02-05-2024]
విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం. -
జగనొస్తే నరకం చూడాల్సిందే!
[ 02-05-2024]
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఏలూరు లో నిర్వహించిన సిద్ధం సభ నగర ప్రజలకు నరకం చూపించింది. -
నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!
[ 02-05-2024]
ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయి. -
ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
[ 02-05-2024]
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
[ 02-05-2024]
ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. -
కల్యాణం.. వైభోగం
[ 02-05-2024]
పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. -
హామీల మోత.. కొర్రీలతో కోత!
[ 02-05-2024]
‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. -
ఉప్పు రైతు బతుకు చేదు
[ 02-05-2024]
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి -
పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
[ 02-05-2024]
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. -
అప్పు తీర్చే విషయంలో ఘర్షణ
[ 02-05-2024]
తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. -
ఓటర్లకు బిర్యానీ గాలం
[ 02-05-2024]
ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
[ 02-05-2024]
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు -
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
[ 02-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?