కుప్పకూలి ఉపాధి కూలీ మృతి
ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు.
వాసు (పాత చిత్రం)
వీరవాసరం, న్యూస్టుడే: ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు. ఆయనకు గుండెపోటు రావడంతో పని ప్రదేశంలోనే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తరలిస్తుండగా ఫిట్స్ వచ్చి ప్రాణాలు వదిలారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు క్షేత్ర పరిశీలకుడు బాలకృష్ణ తెలిపారు. వాసుకు భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు.
కట్నం కోసం వేధింపులు
భీమవరం పట్టణం, న్యూస్టుడే: అదనపు కట్నం కోసం భర్త రామకృష్ణంరాజు, అత్తమామలు వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన యు.రోహిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు రెండోపట్టణ పోలీసులు చెప్పారు.
బీరు సీసాతో దాడి
భీమవరం పట్టణం, న్యూస్టుడే: పాత గొడవల నేపథ్యంలో బీరు సీసాతో దాడి చేసిన ఘటన భీమవరం ఒకటోపట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. ఎం.చిన్న తన స్నేహితులతో ఉండగా ఎం.రాజు వచ్చి సీసా పగులగొట్టి మెడపై గాయపరిచాడు. చిన్న ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపాకు ఓటేశామని...ఉపాధి పనులు నిలిపివేశారు
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం