నీటి తడులకు కంటతడి
ప్రొద్దుటూరు మండలం.. మీనాపురంలోని జగనన్న కాలనీలో నవరత్నాలు.. పేదలందరికీ పథకంలో భాగంగా గ్రామీణ లబ్ధిదారుల ఇంటి కట్టడాలకు తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.1.99 కోట్లతో మంజూరైన పనులు పట్టాలెక్కలేదు. దీనికి నిధుల కేటాయింపునకు స్పష్టమైన హామీ,
జగనన్న కట్టడాలకు కానరాని ట్యాంకర్లతో సరఫరా
రూ.2 కోట్లు విడుదల ప్రతిపాదనలకే పరిమితం
న్యూస్టుడే, ప్రొద్దుటూరు గ్రామీణం
మీనాపురం జగనన్న కాలనీలో ట్యాంకర్ ద్వారా రాళ్ల తొట్టెలో నింపుతున్న నీరు
ప్రొద్దుటూరు మండలం.. మీనాపురంలోని జగనన్న కాలనీలో నవరత్నాలు.. పేదలందరికీ పథకంలో భాగంగా గ్రామీణ లబ్ధిదారుల ఇంటి కట్టడాలకు తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.1.99 కోట్లతో మంజూరైన పనులు పట్టాలెక్కలేదు. దీనికి నిధుల కేటాయింపునకు స్పష్టమైన హామీ, భరోసాపై జిల్లా గృహనిర్మాణ శాఖ నుంచి ప్రతిస్పందన కొరవడింది. దీంతో రెండు దఫాలుగా టెండర్ల ప్రక్రియ చేపట్టిన గుత్తేదారులు పోటీ నుంచి తప్పుకొన్నారు. నిధుల గ్యారెంటీ అంశంపై స్పష్టత లేని కారణంగా జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు తదుపరి కార్యాచరణ నిలిపేశారు. పనులు పూర్తయ్యాక నిధులు విడుదల కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని గుత్తేదారుల భావన అని పంచాయతీ వర్గాలు అంటున్నాయి.
ఖాళీ బిందెలతో ఆపసోపాలు
జగనన్న కాలనీలోని డి-బ్లాక్లో 40 ఎకరాల పరిధిలో 1,804 మంది కొత్తపల్లె పంచాయతీ, ఏడుగురి చొప్పున ఉప్పరపల్లె, నంగనూరుపల్లె గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు. 1.10 సెంట్ల విస్తీర్ణంలో అధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో ఇంటి కట్టడాల పనులు ఇటీవల ఊపందుకున్నాయి. కానీ నీటి తడుల కోసం బండ రాళ్లతో ఏర్పాటు చేసుకున్న తొట్లలోకి ట్యాంకర్లు నీటిని నింపుతున్నారు. అవి ఎంత వరకు సురక్షితంగా ఉంటాయో.. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తొట్టిలోని నీటిని ఖాళీ బిందెల్లో నింపుకొని గుంతల్లో కాంక్రీటు స్తంభాలు, పునాది, గోడలు, ఆర్సీ శ్లాబ్లకు సరిపడే తడుల కోసం ఆపసోపాలు పడుతున్నారు. నీటిని నింపుకోవాలంటే గ్రామ సహాయ ఇంజినీరుకు చెబితే తొట్లలోకి ట్యాంకర్ల నీటిని వదిలిపెడుతున్నారు. ప్రధాన గొట్టాలకు కనెక్షన్లు ఉంటే ప్లాస్టిక్ పైపుల వినియోగంతో శ్రమపడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. సరిపడేవిధంగా నీటి తడులు లేకపోతే కట్టడాలకు దృఢత్వం, సామర్థ్యంపై దుష్ఫ్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ః కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు తమ సొంతింటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ప్రస్తుతం 100 గృహాలకు గుంతల తవ్వకాలతో పాటు పునాది, గోడల నిర్మాణం వరకు వివిధ దశల్లో కట్టడాలు ఉన్నాయి. గొట్టాల నుంచి నేరుగా నీటి సరఫరా లేక లబ్ధిదారులు అవస్థపడుతున్నారు.
శాశ్వత పనులకు అనుమతి మంజూరు
- కరుణాకర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ
రూ.1.99 కోట్ల పనులకు ఆమోదంపై ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదిక పంపాం. జల్జీవన్ మిషన్ (జేజేఎం) కింద మీనాపురం జగనన్న కాలనీల్లో రూ.7 కోట్ల శాశ్వత నీటి సరఫరా పనులకు అనుమతి ఉంది. దీంతో తాత్కాలిక పద్ధతిలో జేజేఎం పనులను చేపట్టడానికి ఉన్నత స్థాయిలో అనుమతి రాగానే వాటి పనులు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్