కళ తప్పిన పత్తి బతుకులు
ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు పత్తిమిల్లులు (జిన్నింగ్)కు పెట్టింది పేరు. నిత్యం వందలాదిమందితో కళకళలాడుతూ ఉండేది. పత్తి మిల్లులే ఆధారంగా జీవనం సాగించే కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి అందించేవి. ఈ మిల్లులతోపాటు నూనె మిల్లులు ఉండేవి. వీటిపై ఆధారపడి
మిల్లుల మూతతో ఉపాధి కోత
పనులు దక్కక పేదల పస్తులు
న్యూస్టుడే, ప్రొద్దుటూరు పట్టణం
మూసివేసిన పత్తి మిల్లులో అద్దె పద్ధతిలో కొనసాగుతున్న చెక్కపాలిష్ దుకాణం
ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డు పత్తిమిల్లులు (జిన్నింగ్)కు పెట్టింది పేరు. నిత్యం వందలాదిమందితో కళకళలాడుతూ ఉండేది. పత్తి మిల్లులే ఆధారంగా జీవనం సాగించే కుటుంబాల్లోని మహిళలకు ఉపాధి అందించేవి. ఈ మిల్లులతోపాటు నూనె మిల్లులు ఉండేవి. వీటిపై ఆధారపడి అనేకమంది బతుకుతున్నారు. మారిన పరిణామాల క్రమంలో భాగంగా నాలుగేళ్లుగా మిల్లులు మూతపడ[డంతో డ్రైవర్కొట్టాల, ఎర్రన్నకొట్టాల, సంజీవయ్యనగర్, భగత్సింగ్కాలనీలకు చెందిన ప్రజల ఉపాధికి గొడ్డలిపెట్టులా మారింది. కొందరు వ్యక్తులు పొట్టకూటికోసం తెలియని పనులు ఒప్పుకోగా.. మరికొందరు కువైట్, సౌదీ లాంటి ప్రాంతాలకు సైతం వెళ్లారు. కొందరు మహిళలు నిరక్షరాస్యులు పూటగడవలేక కడుపేదరికం కావడంతో ఇళ్లల్లో పాచిపనికి వెళుతున్నారు. ఇటీవల మాల్స్, పెద్ద దుకాణాల్లోకి యువత పనికి వెళుతున్నారు. గృహాల్లోని పనులకు వెళ్లలేక ఇంట్లోనే జీవితాలు గడుపుతున్న మహిళలకు ఉపాధి కరవైంది. కొందరి మహిళలు వారి మాటల్లోనే...
ఇంటిల్లిపాది కూలీకి వెళుతున్నాం - మాబున్నీ, గృహిణి
నాలుగేళ్లకు పైగా మిల్లులన్నీ మూసివేయడంతో పని కరవైంది. మగవాళ్లు చేసే పనిపై మాత్రమే ఇంటిల్లిపాది జీవించాల్సి వస్తోంది. పెరిగే ఖర్చులకు ప్రస్తుతం ఒక్కరి వేతనం సరిపోవడం కుటుంబానికి కష్టమే. పనిచేసే ఆసక్తి ఉన్నా దొరకక అవస్థలు పడుతున్నాం.
కుటుంబానికి సహాయ పడుతున్నా - అంకమ్మ
నేను 30ఏళ్లకు పైగా పత్తిమిల్లులో పని చేశాను. మిల్లులు మూసి వేయడంతో ఏ పనికి వెళ్లలేకపోతున్నాను. మిల్లులో కూర్చొని అయినా కొన్ని పనులు చేసుకోవచ్చు. రోజుకు రూ.100ల కూలి వచ్చేది. మిల్లులు లేకపోవడంతో ఇంట్లోనే కుటుంబానికి సహాయపడుతున్నాను.
మిల్లులో పని హూందాతనం కలిగించేది - నాగమ్మ
పత్తిమిల్లుల నుంచి కూలి పని చేసుకొని జీవించేదాన్ని. ఆ మిల్లులు మూసివేయడంతో బతకడం కష్టమై ఇంట్లో పని చేస్తున్నాను. మిల్లులో పని చేసినప్పుడు హూందాతనం ఉండేది. గృహాల్లో పనులు చేస్తున్నా చాలీ చాలని వేతనం వస్తోంది.
ఖర్చులు పెరుగుతున్నా... ఉపాధి కరవైంది - మాబున్న
మా భర్త ఆటో డ్రైవర్. నేను పత్తిమిల్లులో కూలి పనికి పోయేదాన్ని. మిల్లులు మూసివేయడంతో ఏ పనికి పోలేకపోతున్నాం. కొన్నేళ్ల కిందట ఉన్న ఖర్చులకు తగ్గ కూలి అందేది. ప్రస్తుతం ఖర్చులు పెరుగుతున్నా ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. మా ఇళ్ల వద్ద బతలేక కొందరు మహిళలు ఇంట్లో పనికి వెళుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం