ముందే గంట కొట్టారు!
కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు పారదర్శకంగా జరుగుతాయనుకున్న ఉపాధ్యాయులకు తాజాగా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగులకు సాధారణ బదిలీలు పూర్తయిన వెంటనే తమ వంతు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో జరుగుతున్న ప
నేతల సిఫార్సులతో బదిలీలు
ఉపాధ్యాయుల్లో ఆందోళన
ఈనాడు, డిజిటల్ కడప: కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు పారదర్శకంగా జరుగుతాయనుకున్న ఉపాధ్యాయులకు తాజాగా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యోగులకు సాధారణ బదిలీలు పూర్తయిన వెంటనే తమ వంతు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కౌన్సెలింగ్లో కోరుకున్న చోటకు అవకాశం లభించదనే ఉద్దేశంతో తమ పలుకుబడిని, రాజకీయ అండను వినియోగించుకుని పలువురు సిఫార్సులతో బదిలీలకు ప్రయత్నించి దాదాపు కొలిక్కి తెచ్చుకున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో ఓ ఎమ్మెల్యే సిఫార్సుపై మదనపల్లె, పీటీఎం మండలాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తాము కోరుకున్నచోటుకు బదిలీ చేయించుకున్నారు. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సుపై చిట్వేలి మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి తిరుపతి నగరంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు ఒకరు బదిలీ అయ్యారు. టి.సుండుపల్లె మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయిని ఓ ఎమ్మెల్సీ సిఫార్సుపై కడప నగరానికి బదిలీ అయ్యారు. ములకల చెరువు మండలంలో పనిచేసే ఓ ఉపాధ్యాయిని ఏకంగా ఓ మంత్రి సిఫార్సుపై తిరుపతికి బదిలీ అయ్యారు.
వైయస్ఆర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్సీ సిఫార్సుపై చాపాడు మండలంలోని ఓ ఉపాధ్యాయుడికి కడప నగరానికి, ఓ మంత్రి సిఫార్సుతో అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ఒకరికి వైయఆర్ జిల్లా సీకేదిన్నె మండలానికి బదిలీ కానుంది. ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి పలుకుబడితో ప్రొద్దుటూరులో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయినికి తాను కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేందుకు అనుమతి లభించింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా సిఫార్సు లేఖలపై భారీఎత్తున విచ్చలవిడిగా బదిలీలు చేపట్టారని.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హేతుబద్దత లేకుండా ఇష్టారాజ్యంగా బదిలీలతో మూరుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పోస్టులు ఖాళీ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలతో తలెత్తే సమస్యలను విద్యాశాఖ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు