చుక్కల భూముల పేరిట చక్కబెడుతున్నారు!
చుక్కల భూములతో చిక్కుల్లో ఉన్నవారి భూములను కారు చౌకగా కొందరు కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం నిషేధిత జాబితాను తొలగించుకుని భూముల విలువ పెంచుకున్నారు.
వేలాది ఎకరాలకు మినహాయింపు
లబ్ధి పొందుతున్న ‘అధికార’ నేతలు
- ఈనాడు డిజిటల్, కడప
చుక్కల భూములతో చిక్కుల్లో ఉన్నవారి భూములను కారు చౌకగా కొందరు కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం నిషేధిత జాబితాను తొలగించుకుని భూముల విలువ పెంచుకున్నారు. లాభదాయకమైన ఈ వ్యవహారానికి ఇటీవల భారీ ఎత్తున ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమార్కులకు వరంగా మారింది.
నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములను గతానికి భిన్నంగా వేగంగా తొలగిస్తున్నారు. కలెక్టర్ల నిర్ణయానికి అనుగుణంగా రెవెన్యూశాఖ చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియలో అధికారులపై రాజకీయ ఒత్తిడి అధికంగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అన్నమయ్య జిల్లాలోనే 27,014 ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించారు. పలు దఫాలుగా ఉత్తర్వులు జారీ చేసి కొందరికి ప్రత్యేక అవకాశం కల్పించారు. నిషేధిత జాబితాలో ఉండగా విలువ లేని భూములకు తొలగింపు అనంతరం ధరలకు రెక్కలొచ్చాయి. అధికార వైకాపా నేతలు ఈ విధానం ద్వారా బాగా లబ్ధి పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాయచోటి ప్రాంతంలో భారీ ఎత్తున కొందరు నేతలు లబ్ధి పొందినట్లు ప్రచారం జరుగుతోంది. చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వుల ద్వారా అధిక భాగం అన్నమయ్య జిల్లా తరువాతే వైయస్ఆర్ జిల్లాకు చెందినవి ఉండడం చర్చనీయాంశమైంది. గతంలో ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప శివారులోని సీకే దిన్నె ప్రాంతాల్లోని ఎకరాల కొద్దీ చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి, పెద్దశెట్టి పల్లి, చాపాడు మండలం పల్లవోలు, ఓబులవారిపల్లె, రాయచోటి మండలం చెర్లోపల్లి, జమ్మలమడుగు మండలం పెద్దనందలూరు, పులివెందుల మండలం అచ్చవెల్లి, మండల కేంద్రం ముద్దనూరులోని చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించి విముక్తి కల్పించాలంటూ అన్నమయ్య జిల్లాలో 2,500 వరకు దరఖాస్తులొచ్చాయి. వీటిలో చాలా వరకు అధికార పార్టీకి చెందిన వాటికి ప్రాధాన్యమిచ్చి ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ ముసుగులో దేవాదాయ, ప్రభుత్వ, డీకేటీ భూములను సొంతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాధిత రైతులు, పేదలకంటే బడా నేతలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ సమస్య
ఆంగ్లేయుల హయాంలో ఆర్ఎస్ఆర్ తయారీలో తప్పిదాలు దొర్లాయి. ప్రైవేటు భూముల రీ-సర్వే తరుణంలో యజమానులు అందుబాటులో లేకున్నా.. వాటి వద్ద చుక్కలు పెట్టారు. దేవాదాయ, ప్రభుత్వ, డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా చుక్కల భూమిలో చేర్చారు. ఇలాంటి భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించుకోవడానికి సామాన్య ప్రజానీకం కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నా పరిష్కారానికి నోచుకోలేదు. చుక్కల భూముల దరఖాస్తులను వీఆర్వో పరిశీలించాలి. తర్వాత తహసీల్దారు ఆ భూములను గతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయా? లింకు డాక్యుమెంట్లు ఉన్నాయా? వంటి వాటిని తనిఖీ చేసి సిఫార్సు చేయాలి. ఈ వ్యవహారం జరగకుండానే తొలగింపు జాబితాకు సిఫార్సు చేసినట్లు విమర్శలొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు