రామయ్య దర్శనం... భక్తుల పరవశం
ఏకశిలానగరి కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది.
వేడుకగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
కోదండరామాలయంలో ధ్వజారోహణం క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు
ఒంటిమిట్ట, న్యూస్టుడే : ఏకశిలానగరి కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టం వేడుకగా జరిగింది. వేదపండితుల మంత్రాచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల జయజయధ్వానాలతో దాశరథి సన్నిధిలో ఉత్సవ ధ్వజం నింగికెగసింది. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్బాబు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల కంకణదారు, తితిదే పాంచరాత్ర ఆగమశాస్త్రం సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సీతారామలక్ష్మణమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. తితిదే జేఈవో వి.వీరబహ్మ్రం, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్వర్మ, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా హాజరయ్యారు. ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం నేత్రపర్వంగా జరిగింది.
శేషవాహనంపై దాశరథి
దాశరథి శేష వాహనంపై ఆసీనుడై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఒంటిమిట్ట వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఊరేగింపులో దారి పొడవునా తాళ భజనలు, కోలాట నృత్య ప్రదర్శనలు హోరెత్తించాయి. బాలికలు, అతివలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సన్నాయి మేళం, కేరళ కళాకారుల వాయిద్యాల నడుమ మెరవణి కనులపండువగా సాగింది.
ధ్వజారోహణం ఘట్టాన్ని వీక్షిస్తున్న రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్వర్మ, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు
ముత్యాల తలంబ్రాల తయారీ పూర్తి
ఈనెల 5న రాత్రి సీతారాముల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించాలని తితిదే ఉన్నతాధికారులు నిర్ణయించారు. జానకిరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించడానికి తరలిరానున్న భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయాలని అనుమతిచ్చారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న యాత్రికుల వసతి భవన సముదాయంలో శ్వేత డైరెక్టరు ప్రశాంతి పర్యవేక్షణలో శ్రీవారి సేవకుల ద్వారా 1.86 లక్షల ప్యాకెట్లను తయారు చేయించారు.
నేడు వేణుగానాలంకారం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం ఉదయం 8-10 గంటల వరకు వేణుగానాలంకారంలో కోదండరాముడు దర్శనమిస్తారు. ఒంటిమిట్టలో గ్రామోత్సవం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి హంస వాహనంపై సీతారామలక్ష్మణమూర్తుల ఊరేగింపు ఉంటుందని డిప్యూటీ ఈవో నటేష్బాబు తెలిపారు.
శేష వాహనంపై ఊరేగుతున్న సీతారామలక్ష్మణమూర్తులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.