logo

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

మండలకేంద్రంలోని 136 ఏళ్ల నాటి పురాతన సీఎస్‌ఐ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Published : 29 Mar 2024 13:18 IST

కలసపాడు : మండలకేంద్రంలోని 136 ఏళ్ల నాటి పురాతన సీఎస్‌ఐ చర్చిలో శుక్రవారం గుడ్‌ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫాదర్స్‌ సంజయ్‌మధు, ఆసీస్‌ గ్యాబ్రియేల్‌ భక్తులకు సందేశమిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన శాలిని మోహన్‌ భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ బృంద సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పలు ప్రార్థనా మందిరాలు గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని