logo

అశ్వవాహనంపై శ్రీరాముడు

వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు.

Published : 20 Apr 2024 04:33 IST

న్యూస్‌టుడే, వాల్మీకిపురం: వాల్మీకిపురంలో తితిదే ఆధ్వర్యంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అశ్వవాహనంపై శ్రీరాముడు అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగారు. ఉదయం తిరుచ్చిపై సీతాసమేత శ్రీరాముడు విహరించారు. అనంతరం ఆస్థాన మండపంలో తిరుమంజన సేవను కనుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ వైభవంగా జరిపారు. పార్వేట మండపం వద్ద శ్రీరాముడు అశ్వంపై స్వారీ చేస్తూ జింకను వేటాడే దృశ్యాలను భక్తులు తిలకించి పరవశించిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని