ఏం చేశావ్ మేలు... కౌలు రైతు కుదేలు..!
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.
హామీల అమలులో జగన్ సర్కారు ఘోర వైఫల్యం
న్యూస్టుడే, కడప, రాజంపేట గ్రామీణ]
‘కౌలు రైతులను ఆదుకుంటాం....
సాగుహక్కు పత్రాలు అందజేస్తాం...
బ్యాంకుల్లో వడ్డీలేని రుణాలిస్తాం... రాయితీపై
విత్తనాలు పంపిణీ చేస్తాం...ఎరువులు, సూక్ష్మ
పోషకాలు సరఫరా చేస్తాం... ప్రకృతి
విపత్తులతో పంట దెబ్బతింటే నష్టపోతే పెట్టుబడి రాయితీ చెల్లిస్తాం... బీమా ధీమా కల్పిస్తాం’ ఇదీ సీఎం జగన్ ఇచ్చిన హామీలు. వైకాపా అధికారంలోకొచ్చాక వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మొక్కుబడిగా గుర్తింపు కార్డులిచ్చారు. పట్టుమని 10 శాతం మందికి కూడా ఊరట లభించలేదు సరికదా లబ్ధి చేకూరలేదు. జగన్ ఒట్టి మాటలతో ఊరించి ఉసూరుమనించారు.
జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణం నుంచి పదెకాల విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారు. వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఏపీ పంటల సాగు హక్కు చట్టం-2019కు శ్రీకారం చుట్టి పంట సాగు హక్కు ప్రత్రాలు కార్డులివ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ, వ్యవసాయ, అనుబంధ శాఖల పర్యవేక్షణలో కౌలురైతుల గుర్తింపు మొక్కుబడిగా సాగుతోంది. గతంలో మాదిరిగా పత్రం ముద్రించి ఇవ్వకుండా ఆన్లైన్లో పత్రాన్ని తీసి ఇస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అధికారికంగా ధ్రువీకరించి అందజేయాలని ఆదేశించారు. ఒక్కసారి తీసుకుంటే 11 నెలల పాటు చెల్లుబాటయ్యేలా గడువిచ్చారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే ఇస్తున్నారు. చాలామంది కౌలుదారులకు హక్కుపత్రాలు ఇవ్వడానికి సహకారం అందించలేదు. ఈ కారణంతో 12 వేల మందికి కూడా కొత్తగా పత్రాలివ్వలేదు. పాత కార్డుల నవీకరణకు చాలామంది ముందుకు రాలేదు. పత్రం ఉన్నా ఎలాంటి ప్రయోజనాలు కలగకపోవడంతో పునరుద్ధరణకు ముందుకు రావడంలేదు.
నా పేరు భూపల లక్ష్మీనారాయణ. మాది ఒంటిమిట్ట మండలం గుంటికాడిపల్లె. గత ఎనిమిదేళ్లుగా ఆరెకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంట సాగుహక్కు పత్రమివ్వాలని అధికారులను అడిగితే పలకడంలేదు. గుర్తింపు కార్డు లేదని రాయితీపై విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు, రుణాలు ఇవ్వడంలేదు. ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతిన్నా నష్టపరిహారం ఇవ్వడంలేదు.
పెట్టుబడి భారం...
జిల్లాలో ఉద్యాన తోటలను విస్తారంగా సాగుచేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుతోటలు అధికంగా పండిస్తున్నారు. సున్నిత పంటలు కాగా, పైగా పెట్టుబడి ఎక్కువే. రానురాను సాగు ఖర్చులు పెరుగుతుండడం కౌలుదారులపై పెనుభారం పడుతోంది. ప్రైవేటు వ్యాపారుల వద్డ వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటలేస్తున్నారు. కాలం కలిసి రాక, ప్రకృతి ప్రకోపం, తెగుళ్లు, పురుగుల దాడితో తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిసార్లు కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదు. సీఎం జగన్ పాలనలో కనీసం పరిహారం కూడా అందలేదు. పంటల బీమా కూడా ఇవ్వడం లేదు. ఈ-పంట నమోదుకు అనుమతి లభించకపోవడంతో బీమా, పరిహారం దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది.
రుణ భాగ్యమేదీ?...
పంట రుణాలిస్తామని ప్రచారార్భాటం చేసినా అతి తక్కువ మందికే బ్యాంకర్లు ఇచ్చారు. ఖరీఫ్, రబీలలో బ్యాంకుల ద్వారా రైతులకు పెద్దఎత్తున రుణాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. వీరిలో కౌలురైతులకు కనీసమంటే 10 శాతం ఇవ్వాల్సి ఉండగా, 2 నుంచి 5 శాతానికి మించి ఇవ్వడం లేదు. అప్పు తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించపోయినా, ఎగ్గొట్టినా భారం తమపై పడుతుందని భూమి కౌలుకిచ్చిన రైతులు భయపడుతున్నారు. బ్యాంకుల్లో అప్పు తీసుకోవాలని ఆశించిన వారికి భంగపాటు తప్పడం లేదు. గుర్తింపు పత్రం పొందిన తర్వాత కాల పరిమితి కేవలం 11 నెలలు ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన వారు భూ యజమాని అనుమతి పొంది నవీకరించుకుంటేనే చెల్లుబాటు అవుతోంది. లేదంటే లేదు.
మాటలకే పరిమితం
ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు అసలు పొంతనే ఉండడం లేదు. మేలిమి విత్తనాల పంపిణీ మాటలకే పరిమితమైంది. రసాయన, సేంద్రియ సత్తువలు రాయితీపై ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం మంగళం పాడేసింది. రైతు భరోసా సాయం భాగ్యం దక్కడం లేదు. సరళతర విధానాలు అమలు చేయాలని అడుగుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం జగన్ ఏలుబడిలో కౌలుదారులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆపన్నహస్తం మాటే లేదు. దేవదాయశాఖ పర్యవేక్షణలోని ఆలయ మాన్యాల భూములను కౌలుకు ఇస్తున్నారు. వీరికి కూడా ఎలాంటి పత్రాలివ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు
[ 02-05-2024]
జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి -
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
[ 02-05-2024]
బద్వేలు... వైకాపా అరాచక పాలనకు అద్దం పట్టే నియోజకవర్గాల్లో ముందుంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా భూదందాలు రాజ్యమేలాయి. ‘ఒక్క అవకాశమివ్వండి’ అంటూ జనాన్ని నమ్మించి పీఠమెక్కిన జగన్ తన అరాచక దండును కావాల్సినంత దోచుకోనిచ్చారు. -
పేరులోనే కాంతి... ప్రజలకేదీ శాంతి?
[ 02-05-2024]
చూడ్డానికి మంచి వ్యక్తిగా కనిపిస్తారు... నీతులు వల్లిస్తారు... గంభీరంగా మాట్లాడుతూ సచ్చీలుడిగా నటిస్తారు... అన్నా...అన్నా అంటూనే వ్యవహారాలన్నీ చక్కబెడతారు... అయిదేళ్లుగా సహజ వనరులు, భూములను దోచేశారు... -
అధికార పార్టీ అండ... ఇసుకాసురుల దందా!
[ 02-05-2024]
తాగునీటి కరవుతో కడప నగరం గొంతెండుతోంది... నగరంలోని నాలుగు లక్షల మందికి తాగునీరందించే పెన్నానది జలకళను కోల్పోయింది. -
నేడు రాయచోటి, కడపకు చంద్రబాబు
[ 02-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపకు రానున్నారు. -
నిరుద్యోగులకు సీఎం జగన్ మోసం
[ 02-05-2024]
‘బద్వేలు ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు అంటకదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుంటాడంట కదా.. కొండలు.. గుట్టలు వదలిపెట్టడం లేదంటకదా’ అని పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల ఘాటుగా విమర్శలు సంధించారు. -
కలల వంతెన... జగన్ వంచన!
[ 02-05-2024]
పెన్నానదికి అటు, ఇటు ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వంతెన లేకపోవడాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం గుర్తించింది. -
జగన్నాటకం... ఉపాధి బూటకం!
[ 02-05-2024]
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరక్క, బతకడానికి మరోదారి లేక కన్నవాళ్లని, కట్టుకున్నవారిని, బిడ్డలను వదిలి జీవనోపాధి కోసం జిల్లాలోని చాలామంది విదేశాలకు వలస వెళ్లారు. -
వైకాపా పాలనలో సమస్తం దోపిడీయే
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతలకు కీలక పదవులు
[ 02-05-2024]
ఉమ్మడి కడప జిల్లాలో తెదేపాకు చెందిన పలువురు నేతలకు పార్టీ అధిష్ఠానం కీలక పదవులు కట్టబెట్టింది. -
దేవుడి భూముల కబ్జా... వైకాపా నేతల దర్జా!
[ 02-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో జిల్లాలోని వివిధ దేవాలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములకు రక్షణ లేకుండాపోయింది. -
కలుషిత నీరు... వ్యాధులతో బేజారు
[ 02-05-2024]
జీవజలం అంతటా కలుషితమవుతోంది. కనీస వసతుల్లో ప్రధానమైనది తాగు నీరు. పురపాలక సంస్థల్లోని కాలనీల్లో ఎక్కడ చూసినా ఇదే సమస్య కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్