logo

నేడు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్‌

పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల శనివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్‌కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు.

Published : 20 Apr 2024 04:41 IST

ఈనాడు, కడప: పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల శనివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈమె ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప నగరం ఐటీఐ సర్కిల్‌కు 9.15 గంటలకు చేరుకుని ర్యాలీ ప్రారంభిస్తారు. ర్యాలీ సంధ్యా సర్కిల్‌, కోటిరెడ్డి, అంబేడ్కర్‌ వలయం మీదుగా డీసీసీ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు తులసిరెడ్డి, సునీతతో కలిసి కలెక్టరు కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. అనంతరం 11.45 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని