AP News: నన్నెవరూ ఆపలేరు! ఓ అమాత్యుడి అనుచరుడి దందా
పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని...
‘నేను మోనార్క్ని.. నన్నెవరూ ఏమీ చేయలేరు’. అంటూ ఆయన సామాన్యులనే కాదు, అధికారులను సైతం బెంబేలెత్తిస్తుంటాడు. ఇటీవల ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఉదంతంలోనూ అతను నిందితుడు. ఒంగోలు భాగ్యనగర్లో అతని వ్యవహారం నిత్యం చర్చనీయాంశమే. 20 నుంచి 30 మంది దాకా అక్కడ మద్యం సేవిస్తూనే ఉంటారు. వీరితో స్థానికులు పడే ఆవేదన అంతాఇంతా కాదు.. అసలే రౌడీగ్యాంగ్.. ఆ పై రాజకీయ నేపథ్యం ఉన్న ముఠా. దీంతో ఎవరికి వారు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. ఇదీ అధికార వైకాపాకు చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడి దందా..
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ క్రమంలోనే ఒక్క ఒంగోలులోనే మూడు ప్రాంతాల్లో నివాసాలు అద్దెకు తీసుకున్నాడు. ఎవరికీ పైసా అద్దె కట్టడు. అదేమంటే నేత పేరు చెప్పి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భాగ్యనగర్లోని ఒక ప్లాట్లో అతను ప్రస్తుతం ఉంటున్నాడు. రోజూ అర్ధరాత్రి దాటేవరకు మందు పార్టీలు నడుస్తుంటాయి. ఇంటి యజమానికి కొన్నాళ్లుగా అద్దె చెల్లించడం లేదు. అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో ఆందోళనకు గురైన యజమాని తన ప్లాట్కు విద్యుత్తు బిల్లు చెల్లించడం మానేశారు. అధికారులు కనెక్షన్ తీసేశారు. ఆగ్రహించిన ఆ నాయకుడు అనధికారికంగా విద్యుత్తు కనెక్షన్ తీసుకున్నాడు. ఇది తెలిసి వచ్చిన సిబ్బందిని సైతం హెచ్చరించినట్లు తెలిసింది. నగరంలో మరో రెండు ప్రాంతాల్లోనూ సదరు నాయకుడు ఇదే దందా కొనసాగిస్తున్నాడు. రోజూ సుమారు 20 నుంచి 30 మంది వరకు యువకులకు మద్యం పోయించి బల ప్రదర్శన చేయిస్తుంటాడు. ఇక దందాలు సరేసరి. పోలీసులు అతని వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. పోస్టింగులు సైతం వేయిస్తానంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అధికార పార్టీకి సంబంధించి ఒంగోలులో జరిగిన ఓ సంచలన సంఘటనలో అతని పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. దీంతో తాజాగా ఇతర విషయాలు సైతం బయటకు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్