Elephant: బెడిసికొట్టిన ఏనుగు అపహరణ యత్నం!
వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన...
తుమకూరు (బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే: వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుమకూరులోని కరిబసవస్వామి మఠానికి చెందిన లక్ష్మి అనే ఏనుగును అపహరించేందుకు చేసిన యత్నం బెడిసి కొట్టింది. ఈ దొంగలకు సాక్షాత్తూ అటవీ శాఖలోని కొందరు అధికారులు సహకరించడం గమనార్హం. ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..... చిన్న పిల్లాడిని సైతం ఆత్మీయంగానే చూసే లక్ష్మిని ఎలాగైనా అపహరించాలని గుజరాత్కు చెందిన ఓ సర్కస్ కంపెనీ నిర్వాహకులు వ్యూహాన్ని రూపొందించారు. గత నెలలో పశువైద్యుల పేరుతో కొందరు మఠాన్ని సందర్శించారు. ఏనుగుకు వైద్యపరీక్షలు నిర్వహించి దాని కడుపులో గడ్డ ఉందని, తొలగించకపోతే ప్రాణాలకే ముప్పని మఠం వర్గాల్ని బెదిరించారు. దీంతో మఠం ప్రతినిధులు ఏనుగును బన్నేరుఘట్టలోని పశువైద్య కేంద్రానికి తరలించేందుకు అంగీకరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ముఠా సభ్యులు తిరిగి మఠానికి వచ్చి లారీలో ఏనుగును తీసుకెళ్లారు. బన్నేరుఘట్టకు కాకుండా దాబస్పేట రాగానే మావటీని, ఇతర సహాయకులపై దాడిచేసి వారిని లారీ నుంచి దించేశారు. అనంతరం లారీని నేరుగా కుణిగల్ తాలూకాని ఓ గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచి ఉంచారు. విషయం తెలుసుకున్న మఠం వర్గాలు కుణిగల్ తాలూకాలో గాలించి చివరకు ఏనుగును గుర్తించి మరో లారీలో దాన్ని మఠానికి తీసుకొచ్చారు. ఏనుగును అపహరించేందుకు రూ.40 లక్షలకు బేరమాడారని ప్రాథమిక సమాచారం. మఠం వర్గాల ఫిర్యాదు ఆధారంగా తుమకూరు నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు