రూ.50 లక్షలు పైబడిన డాక్యుమెంట్పై టీడీఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కు ఉపక్రమించాలని
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. తాజాగా రూ.50లక్షల విలువ కలిగిన డాక్యుమెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే దానిపై తొలుత టీడీఎస్ మినహాయించుకుని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కు ఉపక్రమించాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ సబ్రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఈ నిర్ణయంతో చాలా మంది అంత విలువ కలిగిన డాక్యుమెంట్లు సమర్పించడానికి భయపడుతున్నారు. ఆస్తిని ముక్కలుగా విభజించి సాధ్యమైనంత వరకు రూ.50లక్షల లోపే డాక్యుమెంట్ విలువ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
టీడీఎస్ అనేది ఆదాయపన్ను శాఖకు వెళ్తుంది. కేంద్రం తిరిగి కొంత రాష్ట్రానికి చెల్లిస్తుంది. దీంతో ఈ ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టి టీడీఎస్ కచ్చితంగా మినహాయించాలని ఆదేశించడంతో గడిచిన కొద్ది రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయని దస్తావేజు లేఖర్లు చెబుతున్నారు. గతంలో వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు టీడీఎస్ కట్టించేవారు. ప్రస్తుతం దాన్ని ఇళ్లు, భవనాలు, ఖాళీ స్థలాలకు అమలు చేస్తున్నారు. దీంతో చాలా మంది టీడీఎస్ నుంచి ఎలా తప్పించుకోవాలని అన్వేషిస్తూ విక్రయించే ఆస్తిని ఒకే డాక్యుమెంట్లో కాకుండా రెండు, మూడు డాక్యుమెంట్లుగా సమర్పించి ఆ మేరకు దాని విలువ రూ.50లక్షల లోపే ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. కారణాలేమైనా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని అధికారులు సైతం అంటున్నారు. రిజిస్ట్రేషన్కు వచ్చిన సమయంలోనే టీడీఎస్ చెల్లించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తుండడంతో పెద్ద పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆసక్తి కనబరచటం లేదని, కేవలం అత్యవసరాలకు ఆస్తులు అమ్ముకునేవారు, పిల్లల పెళ్లిళ్లకు ఆస్తులు బదలాయించుకునే డాక్యుమెంట్లు, తనఖా రుణాలకు సంబంధించినవే ఎక్కువుగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఎప్పుడైతే టీడీఎస్ మినహాయించారో సంబంధిత చెల్లింపుదారుడి వివరాలు ఆన్లైన్లో వెంటనే ఐటీ శాఖకు తెలిసిసోతాయని భయపడుతున్నారు. ఈ నిబంధన రాక మునుపు ఏడాదికి ఒకసారి రిజిస్ట్రేషన్ అధికారులు టీడీఎస్ మినహాయించిన డాక్యుమెంట్ల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేసేవారు. ఈ ప్రకారం పక్కాగా వివరాలు రావడం లేదని, రిజిస్ట్రేషన్ వర్గాలు టీడీఎస్ చెల్లించినా చెల్లించకపోయినా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు కట్టించుకుని రిజిస్ట్రేషన్కు ఉపక్రమించేవారన్న అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పైసా ఆదాయం కీలకంగా మారడంతో ఈ టీడీఎస్ వసూలు అనేది వ్యవసాయ భూముల విషయంలోనే కాదు ఇల్లు, ఖాళీ స్థలాలకు అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవలే ఉత్తర్వులు వెలువరించింది. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నామని రిజిస్ట్రేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆదాయపన్నుశాఖకు ఆదాయం ఎగ్గొట్టకుండా ఉండటానికి ఈ నిబంధనను ఆస్తి రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అమలు చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి టీడీఎస్ కూడా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసి దాన్ని తిరిగి ఐటీశాఖ పద్దులో ఆన్లైన్లో బదిలీ చేస్తున్నామని అధికారులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
[ 20-05-2024]
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం