ఆనందం ఆవిరి!
మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్సింగ్కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం
హొసపేటెలో బాధ్య మంత్రి హోదాలో పాల్గొన్న మంత్రి ఆనంద్సింగ్
హొసపేటె, న్యూస్టుడే: మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్సింగ్కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. మంత్రి ఆనంద్సింగ్కి కూడా ఇది అనుకోని కుదుపే. ఈ నిర్ణయంపై ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తే, ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆరు తాలూకాలతో కూడిన విజయనగరను బళ్లారి నుంచి వేరు చేసి, ఆ జిల్లాకు బాధ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షతో 2019లో కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆనంద్సింగ్ అదే ఏడాది భాజపా నుంచి గెలిచి మంత్రిగా, బళ్లారి జిల్లా బాధ్యత కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి యడియూరప్పను ఒప్పించి 2020లో విజయనగర జిల్లాను ప్రకటింపజేశారు. కరోనా అడ్డురావడంతో జిల్లా ఏర్పాటు కొంత ఆలస్యమైంది. 2021లో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవోలను నియమింపజేశారు. ఆయన బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా ఉండటాన్ని బళ్లారి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీరాములుకు బళ్లారి జిల్లా బాధ్యత అప్పగించాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనంద్సింగ్కు కూడా విజయనగర జిల్లాకు బాధ్యుడిగా ఉండటమే ఇష్టంగా ఉండేది. రెండు జిల్లాలకు బాధ్య మంత్రిగా ఉన్నప్పటికీ 2021 ఆగస్టు 15న కొత్త జిల్లా విజయనగరలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబరులో ముఖ్యమంత్రిని ఆహ్వానించి, అధికారికంగా జిల్లా ప్రకటన చేయించారు. జిల్లా ఏర్పాటు సహా ఆరు తాలూకాల్లో భాజపా బలోపేతానికి కసరత్తు ప్రారంభించారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో విజయనగర జిల్లాలోని ఆరు స్థానాలను గెలుచుకోవాలని వ్యూహరచన ప్రారంభించారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో మరోసారి విజయనగర జిల్లా కేంద్రం హొసపేటెలో బాధ్యమంత్రి హోదాలో జెండా ఆవిష్కరిస్తానని కలలుగన్నారు. వేడుకలకు రెండు రోజుల ముందు ఆనంద్సింగ్ పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ, ఆయన్ను కొప్పళ జిల్లాకు నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంతో సింగ్ తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి. విజయనగర జిల్లా బాధ్యమంత్రిగా నియమించిన శశికళా జొల్లెకి కరోనా సోకడంతో ఆమె కూడా వేడుకల్లో పాల్గొనలేదు. ఈ పరిణామాలను ఇప్పటికీ మంత్రి అనుచరవర్గాలు జీర్ణించుకోవడం లేదు. ఆయన్ను జిల్లా బాధ్యత నుంచి తప్పించడంతో రూ.240 కోట్లతో ఎత్తిపోతల పథకం, రూ.40 కోట్లతో జోళదరాశి కొండ ఆధునికీకరణ, రూ.500 కోట్లతో జిల్లా పూర్తిస్థాయి ఏర్పాటు పనులకు ఆటంకం కలుగుతుందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. వీటిని మంత్రి ఆనంద్సింగ్ కొట్టి పారేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం