ఆనందం ఆవిరి!
మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్సింగ్కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం
హొసపేటెలో బాధ్య మంత్రి హోదాలో పాల్గొన్న మంత్రి ఆనంద్సింగ్
హొసపేటె, న్యూస్టుడే: మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్సింగ్కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. మంత్రి ఆనంద్సింగ్కి కూడా ఇది అనుకోని కుదుపే. ఈ నిర్ణయంపై ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తే, ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆరు తాలూకాలతో కూడిన విజయనగరను బళ్లారి నుంచి వేరు చేసి, ఆ జిల్లాకు బాధ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షతో 2019లో కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆనంద్సింగ్ అదే ఏడాది భాజపా నుంచి గెలిచి మంత్రిగా, బళ్లారి జిల్లా బాధ్యత కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి యడియూరప్పను ఒప్పించి 2020లో విజయనగర జిల్లాను ప్రకటింపజేశారు. కరోనా అడ్డురావడంతో జిల్లా ఏర్పాటు కొంత ఆలస్యమైంది. 2021లో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవోలను నియమింపజేశారు. ఆయన బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా ఉండటాన్ని బళ్లారి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీరాములుకు బళ్లారి జిల్లా బాధ్యత అప్పగించాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనంద్సింగ్కు కూడా విజయనగర జిల్లాకు బాధ్యుడిగా ఉండటమే ఇష్టంగా ఉండేది. రెండు జిల్లాలకు బాధ్య మంత్రిగా ఉన్నప్పటికీ 2021 ఆగస్టు 15న కొత్త జిల్లా విజయనగరలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబరులో ముఖ్యమంత్రిని ఆహ్వానించి, అధికారికంగా జిల్లా ప్రకటన చేయించారు. జిల్లా ఏర్పాటు సహా ఆరు తాలూకాల్లో భాజపా బలోపేతానికి కసరత్తు ప్రారంభించారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో విజయనగర జిల్లాలోని ఆరు స్థానాలను గెలుచుకోవాలని వ్యూహరచన ప్రారంభించారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో మరోసారి విజయనగర జిల్లా కేంద్రం హొసపేటెలో బాధ్యమంత్రి హోదాలో జెండా ఆవిష్కరిస్తానని కలలుగన్నారు. వేడుకలకు రెండు రోజుల ముందు ఆనంద్సింగ్ పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ, ఆయన్ను కొప్పళ జిల్లాకు నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంతో సింగ్ తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి. విజయనగర జిల్లా బాధ్యమంత్రిగా నియమించిన శశికళా జొల్లెకి కరోనా సోకడంతో ఆమె కూడా వేడుకల్లో పాల్గొనలేదు. ఈ పరిణామాలను ఇప్పటికీ మంత్రి అనుచరవర్గాలు జీర్ణించుకోవడం లేదు. ఆయన్ను జిల్లా బాధ్యత నుంచి తప్పించడంతో రూ.240 కోట్లతో ఎత్తిపోతల పథకం, రూ.40 కోట్లతో జోళదరాశి కొండ ఆధునికీకరణ, రూ.500 కోట్లతో జిల్లా పూర్తిస్థాయి ఏర్పాటు పనులకు ఆటంకం కలుగుతుందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. వీటిని మంత్రి ఆనంద్సింగ్ కొట్టి పారేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ‘మహాసంగ్రామం’
[ 06-05-2024]
అభ్యర్థుల తరఫున మలివిడత ప్రచారాన్ని ముగించిన పార్టీలు.. ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. -
భాజపా నేతలవి పగటికలలు
[ 06-05-2024]
కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి లోక్సభ ఎన్నికలు రెండో స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు. -
జనతాదళంలో నిర్వేద పర్వం
[ 06-05-2024]
కీలక నేత హెచ్.డి.రేవణ్ణ అరెస్టుతో జనతాదళ్(ఎస్) శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. ఓ వైపు అగ్రనేత హెచ్.డి.దేవేగౌడను అనారోగ్యం వెన్నాడుతోంది. -
దారితప్పిన కరవు పరిహారం: అశోక్
[ 06-05-2024]
కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది. -
నేతల ప్రచారానికి తాళం..ఓటరు చేతికి పాశుపతాస్త్రం
[ 06-05-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. అసలైన ఘట్టమైన పోలింగ్కు ఓటరు దేవుడు తన పాశుపతాస్త్రంతో సిద్ధమవుతున్నాడు. -
‘జనార్దన్రెడ్డి ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’
[ 06-05-2024]
గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి తమను ఏకవచనంలో సంబోధించడం మానుకోవాలని మంత్రి శివరాజ్ తంగడిగి హెచ్చరించారు. -
చెంప చెళ్లుమనిపించిన డీకే
[ 06-05-2024]
హుబ్బళ్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటి తరఫున సవణూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం రాత్రి ప్రచారాన్ని చేపట్టారు. -
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. -
డీకేను కించపరచిన ముగ్గురిపై కేసు
[ 06-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కించపరిచేలా వివిధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులపై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా