icon icon icon
icon icon icon

NOTA: అక్కడ ‘నోటా’కు ఓటెయ్యాలంటోన్న కాంగ్రెస్‌!

మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తుండగా..  కాంగ్రెస్‌ మాత్రం ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం.

Updated : 06 May 2024 15:26 IST

(పోటీ నుంచి వైదొలిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి)

ఇందౌర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని భాజపా ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ‘నోటా’ (NOTA)కు ఓటేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం. 

ఇందౌర్‌ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్‌ జరగనుంది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీ చేస్తుండగా.. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ మాత్రం చివరి క్షణంలో (ఏప్రిల్‌ 29న) నామినేషన్‌ ఉపసంహరించుకున్నాడు. అనంతరం భాజపాలో చేరిపోయాడు. దాంతో అక్కడ కాంగ్రెస్‌ పోటీలో లేకుండా పోయింది. నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేస్తోంది. తద్వారా భాజపాకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.

సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!

35 ఏళ్ల నుంచీ భాజపాకు కంచుకోటగా ఉన్న ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యేలా కృషి చేయాలని స్థానిక భాజపా కార్యవర్గం నిర్ణయించింది. ఓటింగ్‌ పరంగా ఈ స్థానాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా రికార్డు సొంతం చేసుకోవాలని.. ఇందుకోసం ఓటర్లను ప్రోత్సహించే మార్గాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఇక్కడ దాదాపు 8 లక్షల మెజార్టీతో విజయం సాధించాలని కాషాయ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నియోజకవర్గంలో 25.13లక్షల ఓటర్లు ఉండగా.. 2019లో 69శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img