ఆ తెగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సత్ఫలితాలిస్తోన్న ఈసీ చర్యలు
మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ బూత్లు ఏర్పాటుచేయడం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈసీ అన్ని రకాల చర్యలు చేపడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు.. మరోవైపు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు.. పెద్దగా రవాణా సదుపాయాలు లేని ఇలాంటిచోట్ల పోలింగ్ నిర్వహించడం ఎన్నికల సంఘానికి సవాలే. అయితే.. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరినీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేసేందుకు ఈసీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
దేశ జనాభాలో 8.6 శాతం ఆదివాసీలు ఉన్నట్లు సమాచారం. అందులో అంతరించిపోతున్న ఆదివాసీ సమూహాలు 75 ఉన్నాయి. రవాణా సదుపాయాలు పెద్దగా లేని ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలను ఓటర్లుగా నమోదు చేయడమే కాకుండా.. వారు ఉంటున్న ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఈ కారణంగానే ఏప్రిల్ 19న జరిగిన తొలిదశ ఎన్నికల్లో అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలోని షోంపెన్ తెగ మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంది.
- గత కొంతకాలంగా ఈసీ ఈ దిశగా విస్తృతమైన చర్యలు చేపడుతోంది. ఆదివాసీ తెగలు ఓటుహక్కు పొందేలా.. ప్రత్యేకమైన ప్రచారాలు, రిజిస్ట్రేషన్ డ్రైవ్లు నిర్వహించింది.
- ఒడిశాలో అత్యధికంగా 13 అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు ఉన్నాయి. వీరి జనాభా 2.64 లక్షలు ఉండగా.. 1.84 లక్షల మంది అర్హత గల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 100 శాతం నమోదు ప్రక్రియ పూర్తయిందని.. వారి స్థానిక భాషల్లోనే ఇక్కడ స్పెషల్ డ్రైవ్లను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 666 థీమ్ పోలింగ్ బూత్లను ఏర్పాటుచేశారు. ఈ రాష్ట్రంలో 4వ దశ నుంచి 7వ దశ వరకూ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
- చత్తీస్గఢ్లో ఇలాంటి ఆదివాసీ తెగలు 5 ఉన్నాయి. 18 జిల్లాల్లో వీరు విస్తరించి ఉన్నారు. ఇక్కడ 1.20 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వంద శాతం నమోదు ప్రక్రియను పూర్తి చేసి వారికి ఓటరు గుర్తింపుకార్డులు అందించారు. తమిళనాడులో 6, బిహార్లో 5, ఝార్ఖండ్లో 9, గుజరాత్లో 5 తెగలు ఉన్నాయి. వీరంతా ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ అన్నిరకాల చర్యలు తీసుకుంది.
- ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడం రిస్క్తో కూడుకున్న పని. ఛత్తీస్గఢ్లోని ప్రభావిత ప్రాంతాల్లో 102 గ్రామాల్లో తొలిసారిగా పోలింగ్ బూత్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఝార్ఖండ్లోని పాథెల్, గాడియా ప్రాంతాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను మొదటిసారి ఏర్పాటుచేసింది. పోలింగ్ సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు ఇక్కడ హెలికాప్టర్లను కూడా వాడుతున్నారు. గతంలో ఈ ప్రాంతాల వారు ఓటు వేయడానికి కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
- గుజరాత్లోని మినీ ఆఫ్రికా గ్రామంలో మూడో దశలో ఉత్సాహంగా పోలింగ్ జరుగుతోంది. జంబుర్ ప్రాంతంలో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 2022లో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటుహక్కు కల్పించింది. ప్రత్యేకంగా వీరి కోసం ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటుచేశారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు