icon icon icon
icon icon icon

Lok sabha elections: పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన బాలుడు.. దృశ్యాలు వైరల్‌

Lok sabha elections: లోక్‌సభ ఎన్నికల్లో.. ఓ బాలుడు ఓటు వేసిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 09 May 2024 16:52 IST

దిల్లీ: ప్రస్తుతం దేశంలో దశలవారీగా సార్వత్రిక ఎన్నికలు (Lok sabha elections) జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఒక పోలింగ్‌ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బెరాసియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బెరాసియా ప్రాంతానికి చెందిన వినయ్ మెహర్.. భాజపా స్థానిక నేత. తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవీఎం బటన్ నొక్కి భాజపాకు ఓటు వేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక ఖాతాల్లో చక్కర్లు కొట్టాయి. దాంతో ఇవి కాస్తా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ దృష్టికి చేరాయి. ‘‘భాజపా.. ఎన్నికల సంఘాన్ని పిల్లల ఆట వస్తువుగా మార్చింది. భాజపా నేత వినయ్ మెహర్ తన ఓటును కుమారుడితో వేయించారు. ఆ తతంగాన్ని వీడియో తీసి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పిల్లల్ని, మొబైల్‌ ఫోన్లను లోపలికి ఎలా అనుమతించారు..? దీనిపై ఏమైనా చర్యలు ఉంటాయా..?’’ అని కమల్‌నాథ్‌ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి స్పందన రావాల్సి ఉంది.

గుజరాత్‌లోని దాహోద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో కూడా ఇదేతరహా ఘటన ఒకటి జరిగింది. కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన విజయ్ భాభోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు స్థానిక భాజపా నేత కుమారుడు. ఇలాంటి చర్యతో ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img