Priyanka Gandhi: కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక
అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో అమేఠీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. దీంతో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. పార్టీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేఠీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 24 గంటలూ ఇక్కడే ఉండి.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేఠీ నుంచి పార్టీకి విధేయుడు కిశోరీ లాల్ శర్మ బరిలో ఉన్నారు. వీరి తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రియాంక సోమవారం రాయ్బరేలీకి చేరుకున్నారు.
ప్రియాంక ప్రచారం ఇలా..
- రాయ్బరేలీలో స్థానిక కాంగ్రెస్ నేతలతో మారథాన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్లేలా కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
- సుడిగాలి పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బుధవారం ఒక్క రోజే ఆమె తొమ్మిది సభల్లో పాల్గొననున్నారు. మే 18 వరకూ తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
- ‘‘ఆమేఠీ, రాయ్బరేలీలో మనం గట్టిగా పోరాడాలి. ఇప్పుడు మీ 24 గంటలు నావే. అవసరమైతే మిమ్మల్ని తిడతాను, పరుగెత్తిస్తాను. అయితే.. మీ వెంట బలంగా నిలబడతాను. మా ఇంటి తలుపులు మీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు. భాజపా మన నుంచి రిజర్వేషన్లను లాక్కోవాలని చూస్తోంది’’ అని ఆమె పార్టీ శ్రేణులకు గీతోపదేశం చేశారు.
- ‘దేశ ప్రయోజనాల కోసం మన పూర్వీకుల రక్తం, చెమటతో తడిసిన నేల ఇది. ఇది మనకు అత్యంత పవిత్రమైన నేల. దేశంలోని ప్రతి పౌరుడి ఆత్మగౌరవం కోసం పోరాడదాం’’ అంటూ ఉద్వేగభరిత ప్రసంగాలతో ఆమె ఆకట్టుకుంటున్నారు.
- ఆమేఠి, రాయ్బరేలీకి ఐదో దశలో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది.
రాయ్బరేలీ కాంగ్రెస్కు కంచుకోట. 1952 తర్వాత హస్తం పార్టీ ఇక్కడ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. ఫిరోజ్గాంధీ, ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. నరేంద్ర మోదీ హవాలోనూ ఇక్కడ సోనియాగాంధీ 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో ఆమె రాజ్యసభకు వెళ్లిపోవడంతో.. ఈ స్థానం నుంచి రాహుల్గాంధీ బరిలోకి దిగారు.
ఇక పార్టీకి ఎంతో పట్టున్న అమేఠీలో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు వయనాడ్ నుంచి గెలుపొందారు. ఈ సారి ఆ స్థానంతో పాటు రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఒకచోటు నుంచి ప్రియాంకా గాంధీ కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరికి ఆమెను ప్రచారంలో కీలకంగా ఉపయోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!