Tokyo Olympics: ఒలింపిక్ డిప్లొమా గురించి తెలుసా?
ప్రపంచక్రీడ ఒలింపిక్స్లో అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో తొలిస్థానం దక్కించుకున్నవారికి స్వర్ణ పతకం, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రజత, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన వారి సంగతేంటి? ఏముంది ఓడిపోయి
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచక్రీడ ఒలింపిక్స్లో భాగంగా అనేక విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిలో తొలిస్థానం దక్కించుకున్నవారికి స్వర్ణ పతకం, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రజత, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన వారి సంగతేంటి? ఏముంది ఓడిపోయి స్వదేశానికి వెనుదిరుగుతారు అంతేగా అనుకుంటున్నారా? కాదండీ.. క్రీడల ఫలితాల జాబితాలో టాప్ 8 అథ్లెట్లకు ‘ఒలింపిక్ డిప్లొమా’ దక్కుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఏంటీ ఒలింపిక్ డిప్లొమా?
దేశానికి పతకం సాధించిపెట్టాలన్న లక్ష్యంతోనే అథ్లెట్లు కఠోర శిక్షణతో ఒలింపిక్స్కు సిద్ధమవుతారు. నాలుగేళ్లు శ్రమించి.. బరిలోకి దిగుతారు. గెలవాలనే పట్టుదలతోనే పోటీ పడతారు. కానీ, అందరూ పతకాలు గెలవలేరు కదా! అత్యుత్తమ ప్రదర్శనతో ఒకరు మాత్రమే స్వర్ణం గెలవగలరు. ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నవారు కూడా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకుంటారు. అయితే, అంత కష్టపడి పోటీలో పాల్గొని తృటిలో పతకం కోల్పోయిన వారిని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐవోసీ) ఉట్టి చేతులతో పంపించాలని అనుకోలేదు. అందుకే, జాబితాలో టాప్లో ఉన్న ఎనిమిది మందికి ఒలింపిక్ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తోంది. అందులో క్రీడావిభాగం.. అథ్లెట్ పేరు.. నిలిచిన స్థానం రాసుంటుంది. దానిపై ఐవోసీ అధ్యక్షుడు, ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుల సంతకాలు ఉంటాయి.
ఎప్పటి నుంచి మొదలుపెట్టారు?
1896లో నిర్వహించిన తొలి మోడ్రన్ ఒలింపిక్స్ నుంచే ఈ ఒలింపిక్ డిప్లొమా ప్రదానం జరుగుతోంది. అయితే, ఆ ఒలింపిక్స్లో కేవలం స్వర్ణ పతకం గెలిచిన వ్యక్తికే డిప్లొమా ఇచ్చారు. ఆ సమయంలో కేవలం స్వర్ణ, రజత పతకాలే ఉండేవి. రెండో ఒలింపిక్స్-1900లో స్వర్ణం, రజతంతోపాటు కాంస్య పతకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, 1924 నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి పతకాలతోపాటు డిప్లొమా ఇస్తూ వచ్చారు. 1948 నుంచి జాబితాలో టాప్ 6 అథ్లెట్లకు, 1980 తర్వాత నుంచి టాప్ 8 అథ్లెట్లకు ఈ ఒలింపిక్ డిప్లొమాను ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ అథ్లెట్లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఐవోసీ ఉద్దేశం. అయితే, ఇలా డిప్లొమా పొందిన అథ్లెట్లు ఐవోసీ నిబంధనలు ఉల్లంఘించినా.. డోపింగ్ పరీక్షల్లో దొరికినా ఈ డిప్లొమా సర్టిఫికెట్ను ఐవోసీకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్