స్విట్జర్లాండ్లో ఏడాదికో అధ్యక్షుడు!
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. తమ అభ్యర్థిని అధ్యక్షుడిని చేయాలని సర్వశక్తుల ప్రయత్నిస్తాయి. గెలిచిన అభ్యర్థులు నాలుగు/ఐదు సంవత్సరాలు అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికలొచ్చాయంటే చాలు.. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడతాయి. తమ అభ్యర్థిని అధ్యక్షుడిని చేయాలని సర్వశక్తులూ ఒడ్డుతాయి. గెలిచిన అభ్యర్థులు నాలుగు/ఐదు సంవత్సరాల పాటు దేశానికి సేవలందిస్తారు. స్విట్జర్లాండ్లో మాత్రం ఇలా జరగదు! అక్కడ ఏడాదికొకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పరిపాలిస్తుంటారు.
స్విట్జర్లాండ్లోనూ అమెరికా తరహాలోనే నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ దాదాపు 15 పార్టీలున్నాయి. నాయకులంతా ఎన్నికల్లో నేషనల్ కౌన్సిల్ (200 స్థానాలు), కౌన్సిల్ ఆఫ్ స్టేట్మ(46 స్థానాలు)లకు పోటీ చేస్తారు. ఈ రెండు సభలను కలిపి ఫెడరల్ అసెంబ్లీ (పార్లమెంట్)అంటారు. ఈ కౌన్సిల్ నుంచి ఎన్నుకోబడ్డ ఏడుగురు సభ్యులతో ‘స్విస్ కాన్ఫెడరేషన్’ ఏర్పడుతుంది. ఇదే స్విట్జర్లాండ్ను నాలుగేళ్లపాటు పరిపాలిస్తుంది. ఇందులో ఉండే ఏడుగురు కౌన్సిలర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరు అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
అయితే, ఈ బృందంలోని సభ్యులు ఏడాదికొక్కరు చొప్పున అధ్యక్ష పదవిని పంచుకోవడం విశేషం. ఒక ఏడాది ఉపాధ్యక్షుడిగా ఉన్నవాళ్లు.. తర్వాతి ఏడాది అధ్యక్షులవుతారు. అయితే ఈ కాన్ఫెడరేషన్లో అన్ని పార్టీల వారు ఉంటారు. 2019లో ఎన్నికలు జరగగా.. వివిధ పార్టీలకు చెందిన వియోలా అమ్హెర్డ్, యూలీ మౌరర్, గై పెర్మెలిన్, ఇగ్నాజియో కాసిస్, అలైన్ బార్సెట్, కరిన్ కెల్లర్-సుట్టర్, సిమొనెట్టా సొమరుగా ‘స్విస్ కాన్ఫెడరేషన్’కు ఎన్నికయ్యారు. గతేడాది మౌరర్ దేశాధ్యక్షుడిగా ఉండగా.. ఈ ఏడాది సిమొనెట్టా సొమరుగా అధ్యక్ష పీఠంపై కూర్చొన్నారు. స్విట్జర్లాండ్లో పరిపాలన ఎంతో పారదర్శకంగా ఉంటుంది. రాజ్యాంగంలో సవరణ చేయాలన్నా.. చట్టాల్లో సవరణ చేయాలన్నా దేశవ్యాప్తంగా రెఫరెండం నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!