నిజాం కుమార్తె కన్నుమూత
ఏడో నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్ కుమార్తె సాహెబ్జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్కాటేజ్
చార్మినార్, న్యూస్టుడే: ఏడో నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్ కుమార్తె సాహెబ్జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్కాటేజ్ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్జంగ్ చాలాకాలం క్రితమే మరణించారు. ఆమెకు ఒక కుమార్తె షహెబ్జాదీ రషీదున్నీసా బేగం, కుమారుడు సంతానం. కుమారుడు సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయాడు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. బషీరున్నీసాబేగం భౌతిక కాయాన్ని పురానీహవేలీ సమీప మసీదుకు తరలించి జనాజా నమాజ్ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్నజాఫ్అలీఖాన్, మ్యూజియం డైరక్టర్ రఫత్హుస్సేన్ బేగం, క్యూరేటర్ అహ్మద్అలీ సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.