చిత్తూరు జిల్లాలో ‘నివర్’ బీభత్సం
చిత్తూరు జిల్లాలో నివర్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకుపోతున్నాయి....
ఏరులైపారుతున్న నదులు, వాగులు, చెరువులు
ఇంటర్నెట్ డెస్క్: చిత్తూరు జిల్లాలో నివర్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకుపోతున్నాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతమైన నడుంపల్లి గ్రామం నీట మునిగింది. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరిలో భీమ, స్వర్ణముఖి నదుల ఉద్ధృతికి అనేక రహదారులు కొట్టుకుపోయి 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రావారిపాలెం మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లగా వలసపల్లి, బోడేవాండ్లపల్లి, బాకరాపేటకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. రామచంద్రాపురంలోని రాయల చెరువుకు ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
శేషాచల అడవుల నుంచి కళ్యాణి డ్యాంకు వరద పోటెత్తడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేస్తామన్న అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చిత్తూరు జిల్లాలోని అరణియారు, కాలకి, మల్లెమడుగుతోపాటు అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. దీంతో గేట్లు ఎత్తేసి నీటిని కిందకి వదులుతున్నారు. అరణియారు జలాశయం నుంచి 6500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ధాటికి పుంగనూరు నియోజకవర్గంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. పూర్తి వివరాలకు కింది వీడియోను చూడండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?