జగన్‌ అక్రమాస్తుల కేసు.. రేపటికి వాయిదా

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితుడు,

Published : 27 Oct 2020 17:34 IST

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. సీబీఐ ఛార్జ్‌షీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై ఏసీబీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని.. నిందితుల ప్రమేయంపై ఆధారాలున్నాయని వాదించారు. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని