ఇంట్లో ఉంటే వీల్ఛైర్గా.. బయటకెళ్తే బైక్గా..!
పుట్టుకతో లేదా ఏదైనా ప్రమాదం కారణంగా అంగవైకల్యం ఏర్పడి నడవలేని స్థితి ఉన్న వారి జీవితం సాధారణంగా చక్రాల కుర్చీకే పరిమితం అవుతుంటుంది. అలాంటి వారు తమ పనుల కోసం చాలావరకు ఇతరులపై ఆధార పడవలసి వస్తుంది. కానీ..
ఇంటర్నెట్ డెస్క్: పుట్టుకతో లేదా ఏదైనా ప్రమాదం కారణంగా అంగవైకల్యం ఏర్పడి నడవలేని స్థితి ఉన్న వారి జీవితం సాధారణంగా చక్రాల కుర్చీకే పరిమితం అవుతుంటుంది. అలాంటి వారు తమ పనుల కోసం చాలావరకు ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. కానీ.. అన్ని సమయాల్లోనూ వారికి సహాయం చేసేందుకు ఇతరులు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి దివ్యాంగుల కోసమే చక్రాల కుర్చీ స్థానంలో.. న్యూ బోల్ట్ వీల్ ఛైర్ను అందుబాటులోకి తెచ్చింది ఐఐటీ మద్రాస్కు చెందిన ఓ మిత్రబృందం. దివ్యాంగులకు చక్రాల కుర్చీ బలమవ్వాలే కానీ.. బలహీనం కాకూడదని భావించింది ఆ బృందం. అందుకోసమే.. ఆధునిక సాంకేతికతతో న్యూ బోల్డ్ వీల్ ఛైర్ను రూపొందించి అందరి మన్ననలు అందుకుంటోంది. ఆ వివరాలేంటో మీరూ చూసేయండి...
ఐఐటీ మద్రాస్కు చెందిన సౌరభ్ మిత్రులతో కలిసి న్యూ మోషన్ అనే అంకుర సంస్థను స్థాపించారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి సరికొత్త సాంకేతిక పరికరాలు తక్కువ ధరలో అందించాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. మొదటగా ఆధునిక సాంకేతికతతో కూడిన చక్రాల కుర్చీలను మార్కెట్లోకి తీసుకురావాలని అనుకున్నారు. అందుకోసం దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వందల రకాల చక్రాల కుర్చీల గురించి అధ్యయనం చేశారు. వాటిని వాడుతున్న వారి అనుభవాలు, అవసరాల గురించి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే రెండు ప్రధాన సమస్యలను గుర్తించారు. అందులో ఒకటి.. అందరూ ఒకే పరిమాణంలో గల పెద్దసైజు చక్రాల కుర్చీలను ఉపయోగించటం. ఇది ఒకే సైజు పాదరక్షలను అందరూ వినియోగించటం లాంటిది. ఇప్పటి వరకూ ఉన్న చక్రాల కుర్చీలు బయట దూర ప్రాంతాలకు వెళ్లటానికి అంతగా అనుకూలం కావు. ఇంట్లో అవసరాలకే ఉపయోగపడుతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు న్యూ బోల్డ్ వీల్ఛైర్ను రూపొందించారు. ఇంట్లో ఉన్నప్పుడు చక్రాల కుర్చీగా.. బయటకు వెళ్లినపుడు మోటరైజ్డ్ వాహనంగా దీనిని మార్చుకోవచ్చు. దీనిలో లిథియం ఆయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. నాలుగు గంటల పాటు ఛార్జ్ చేస్తే ఈ వీల్ఛైర్తో 30 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయవచ్చు.
చక్రాల కుర్చీకి ఇలాంటి ఏర్పాట్లు చేయటం వల్ల దివ్యాంగులకు ఎంతో ఉపయోగం అంటున్నారు న్యూమోషన్ సంస్థ సభ్యులు. వినియోగదారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకు తగ్గట్టుగా దీనిని మార్చుకునే వీలుండటం అద్భుతమని చెబుతున్నారు. ఎవరిపై ఆధారపడకుండా పనులు చేసుకునేందుకు ఈ వీల్ఛైర్ దోహదపడుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యూ మోషన్ తీసుకువచ్చిన ఈ వీల్ఛైర్ వినియోగదారుల హృదయాలనేకాక .. నాస్కామ్ ఫౌండేషన్ అవార్డునూ గెలుచుకుంది. స్టార్టప్ ఇండియా పోటీల్లో రెండోస్థానం, అంతర్జాతీయ రెడ్క్రాస్ నిర్వహించిన కాంపిటీషన్లో ఉత్తమ డిజైన్ అవార్డును కైవసం చేసుకుంది. 2025 వరకు లక్షమంది దివ్యాంగులకు ఈ వీల్ఛైర్లు అందించటమే లక్ష్యంగా న్యూ మోషన్ అడుగులు వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్