స్లాట్ల బుకింగ్‌తో రూ.85లక్షల ఆదాయం: సీఎస్‌

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ల బుకింగ్‌ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు 37 స్లాట్లు బుక్‌ చేసుకున్నట్లు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ.85 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల..

Updated : 12 Dec 2020 12:12 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్లాట్ల బుకింగ్‌ కొనసాగుతోంది. ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు 37 స్లాట్లు బుక్‌ చేసుకున్నట్లు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ.85 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు ప్రారంభమైనట్లు చెప్పారు. రూ.200 చెల్లించి మీసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించినట్లు సీఎస్‌ తెలిపారు. పోర్టల్‌ ద్వారా సులువుగా డాక్యుమెంట్‌ కూడా తయారు చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. బిల్డర్లు, డెవలపర్ల కోసం ప్రత్యేక విండో ఏర్పాటు చేసినట్లు సోమేశ్‌ కుమార్‌ వివరించారు. ఇవాళ రాత్రి 7 గంటల వరకు 451 మంది బిల్డర్లు 93వేలకుపైగా కొత్త ఆస్తులను నమోదు చేసినట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని