Allahabad Court: విద్యార్థినిని ఆదుకున్న న్యాయస్థానం.. అడ్మిషన్ ఫీజు కట్టిన అలహాబాద్ హైకోర్టు!
మంచి ర్యాంక్ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్ ఫీజు రూ. 15వేలు చెల్లించింది.. మూడు రోజుల్లో
అలహాబాద్: మంచి ర్యాంక్ సాధించి.. ప్రముఖ యూనివర్సిటీలో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినికి అలహాబాద్ హైకోర్టు అండగా నిలిచింది. ఆమెను యూనివర్సిటీలో చేర్పించడం కోసం స్వయంగా అడ్మిషన్ ఫీజు రూ. 15వేలు చెల్లించి.. మూడు రోజుల్లో యూనివర్సిటీలో చేరమని విద్యార్థినికి సూచించింది.
యూపీకి చెందిన విద్యార్థిని సంస్కృతి రంజన్ ఇటీవల జేఈఈ పరీక్షలో 92.77 పర్సంటైల్తో ఉత్తీర్ణత పొంది 2,062వ ర్యాంకు సాధించింది. ఎస్సీ కోటాలో మంచి ర్యాంకు పొందిన ఆమె బీహెచ్యూలో ఐదేళ్ల మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులో చేరాలని భావించింది. కానీ.. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పేదరికం.. పైగా ఆమె తండ్రి కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీంతో అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.
యూనివర్సిటీలో అడ్మిషన్ ఫీజు చెల్లించలేక తీవ్ర నిరాశకు గురైన సంస్కృతి.. ఇద్దరు న్యాయవాదుల సాయంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు ఎలాగైనా యూనివర్సిటీలో అడ్మిషన్ ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యాన్ని, కేంద్ర విద్యాశాఖకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్కుమార్ సింగ్ ఆ అడ్మిషన్ ఫీజు రూ.15వేలు తామే చెల్లిస్తామని వెల్లడించారు. ‘ఎంతో బాగా చదువుకుంటున్న విద్యార్థిని ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఆమె తండ్రి అనారోగ్యంపాలవడంతో ఫీజు చెల్లించే స్థోమత వారికి లేకుండాపోయింది. విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకొని యూనివర్సిటీ అడ్మిషన్ ఫీజును కోర్టే చెల్లిస్తుంది’అని జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!