Anand Mahindra: మన వాళ్లని తక్కువ అంచనా వేయొద్దు సుమీ!
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్ ఉమ్మా’’ మీద పోస్టు చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తుంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కేలాగ్స్’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సరికొత్త విషయాలు నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని స్ఫూర్తిదాయకమైనవైతే.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయన ‘‘కెలాగ్స్ ఉప్మా’’ మీద పోస్టు చేసిన మీమ్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. విషయానికొస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం ‘‘కెలాగ్స్’’ అనే అమెరికా ఆహార ఉత్పత్తి సంస్థ భారత్లో అడుగుపెట్టింది. ప్రారంభంలోనే.. ఇంకేముంది ‘‘భారతీయుల బ్రేక్ఫాస్ట్ అలవాట్లు మార్చేస్తాం.. ఇడ్లీ, ఉప్మా దోశ బదులు కార్న్ఫ్లేక్స్, చాకో పాప్స్ తినేలా చేస్తాం’’ అంటూ సవాళ్లు విసిరింది. మరి మన భారతీయులు వారి ఆలోచనకు లొంగకపోవడం సరికదా! చివరకు ఆ కంపెనీ చేత ‘ఉప్మా’ ఉత్పత్తి చేయించేలా చేశారు. సరిగ్గా ఇదే విషయాన్ని మహీంద్రా ప్రస్తావిస్తూ ..‘‘ ఈ సంస్థ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. ఇది పాత మీమ్ అయినప్పటికీ.. ప్రస్తుతం అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అందుకే మన లోకల్ ‘ఛాంపియన్స్’ గురించి తక్కువ అంచనా వేయొద్దు’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందించారు. ‘‘మేము కేవలం ఆహారాన్ని మాత్రమే తినము. సెంటిమెంట్లను కూడా తింటాం’’ అని ఒకరనగా..ఇక బ్రేక్ఫాస్ట్లో వీరి నుంచి దోశ, ఇడ్లీ కూడా మార్కెట్లోకి వస్తుందనుకుంటున్నా అంటూ మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి