AP CM Jagan : కొవిడ్ సంక్షోభాన్ని ఏపీ సమర్థంగా ఎదుర్కొంది : జగన్
కొవిడ్ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో
దావోస్ : కొవిడ్ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరై ప్రసంగించారు.
‘రాష్ట్ర విభజన తర్వాత మాకు అత్యున్నత, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. భారత్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి ఆస్పత్రులు మావద్ద లేవు. అయినప్పటికీ వాలంటీర్లు , గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కోవిడ్ సంక్షోభాన్నిఎదుర్కోవటంలో ఏపీ ముందుంది. ప్రాథమిక స్థాయిలో వైద్యారోగ్యం అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో 44 సార్లు మేము ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేపట్టాం. ఆ సమయంలో ఏపీ మరణాల రేటు 0.63 శాతం మాత్రమే ఉంది. దేశంతో పోలిస్తే ఏపీ మరణాల రేటు అతి తక్కువ’
‘ప్రభుత్వాలు ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్ పై దృష్టి పెట్టాలి. వైద్యారోగ్యం ఎంతమందికి అందుబాటులో ఉందన్న విషయాలపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. ఏపీలో గ్రామ, మండల స్థాయిలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. 104 వాహనాలతో పాటు, విలేజ్ క్లీనిక్స్లో ఉండే వైద్యులు గ్రామానికి కుటుంబ వైద్యులుగా వ్యవహరిస్తారు’
‘వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. రూ.16 వేల కోట్లను వైద్యారోగ్య సేవలు మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం 11 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కొత్త వైద్యులను తయారు చేసేందుకు వీలుగా మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. బోధనాసుపత్రులు పెంచటం ద్వారా వైద్యుల కొరత తీర్చాలనేది మా లక్ష్యం. కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. వైద్యారోగ్య సేవలకు బీమా తప్పనిసరిగా ఉండాలి. భారత్లో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చేపట్టారు. అయితే.. ఇది 1000 చికిత్సలనే ఉచితంగా అందిస్తోంది. పేదలు వైద్యం చేయించుకునేందుకు ఇది ఏమాత్రం సరిపోదు. ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం. దీని ద్వారా 2,446 వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాం ’ అని జగన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్