AP High Court: అమరరాజా భూములపై యథాతథ స్థితి కొనసాగించండి: హైకోర్టు

తిరుపతి సమీపంలో అమరరాజా సంస్థకు చెందిన కరకంబాడి భూముల అంశంపై యథాతథస్థితి కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Published : 20 Apr 2022 13:37 IST

అమరావతి: తిరుపతి సమీపంలో అమరరాజా సంస్థకు చెందిన కరకంబాడి భూముల అంశంపై యథాతథస్థితి కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ కంపెనీపై ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమరరాజా సంస్థకు కరకంబాడిలో భూములను కేటాయించింది. అయితే అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదంటూ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీనిపై అమరరాజా సంస్థ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఆ భూముల అంశంలో యథాతథస్థితి ఉంచాలని స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని