సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
central bank of India: సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
ముంబయి: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central bank of India) అప్రెంటిస్షిప్ శిక్షణకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ శిక్షణలో భాగంగా 5000 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ/తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ రెండో వారంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్లో 41, గుంటూరు 60, విశాఖ 40చొప్పున) ఖాళీల్ని భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 106(హైదరాబాద్ 65, వరంగల్ 41 చొప్పున) భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ముఖ్యాంశాలివే..
- దరఖాస్తులు ప్రారంభం: మార్చి 20న
- దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్ 3
- శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు ఉంటుంది.
- స్టైఫండ్: రూరల్/సెమీ అర్బన్ బ్రాంచ్లలో నెలకు రూ.10వేలు, అర్బన్ బ్రాంచుల్లో రూ.12000, మెట్రో శాఖల్లో అయితే రూ.15000 చొప్పున ఇవ్వనున్నారు. దీనికితోడు ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తారు.
- వయోపరిమితి: మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
- పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే రూ.800; దివ్యాంగుంగులైతే రూ.400, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు రూ.600లుగా నిర్ణయించారు. ఈ ఫీజుకు జీఎస్టీ అదనం.
- పరీక్షవిధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిట్నెస్ పరీక్ష, స్థానిక భాషలో ప్రావీణ్యతను చూస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!