Telangana News: బర్త్‌డే పేరుతో.. 12ఏళ్ల బాలికకు 35ఏళ్ల వ్యక్తితో పెళ్లి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిగింది. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో

Published : 16 May 2022 11:21 IST

కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిగింది. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికకు పెళ్లి చేశారు. దీంతో బాలిక.. పెళ్లి విషయాన్ని ఐసీడీఎస్‌ సిబ్బంది, గ్రామస్థులకు తెలిపింది. అనంతరం పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వాగ్వాదంతో బంధువుల ఇంటి నుంచి బాలిక వెళ్లిపోయింది. ఐసీడీఎస్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని