Cm jagan: ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో సిఫార్సులకు అవకాశం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమర్థులు, ప్రతిభ ఉన్న వారినే టీచింగ్ స్టాఫ్గా తీసుకోవాలన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో సిఫార్సులకు అవకాశం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. సమర్థులు, ప్రతిభ ఉన్న వారినే టీచింగ్ స్టాఫ్గా తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు నిర్వహించి టీచింగ్ స్టాఫ్ను ఎంపిక చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు. కోర్సులో భాగంగా పట్టభద్రులకు 10 నెలల ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయాలన్నారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పడే 30 నైపుణ్య కళాశాలల్లో ఇంటర్న్షిప్ ఉండేలా చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..