ఆర్టీసీ ఉద్యోగ భద్రత దస్త్రానికి కేసీఆర్‌ ఆమోదం

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్‌ గురువారం..

Published : 05 Feb 2021 02:23 IST

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్‌ గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి కేసీఆర్ గురువారం ఆమోదం తెలిపారు.

ఇవీ చదవండి..

ఇకపై హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు నేరుగా..

ఆ విచారణలో మేం జోక్యం చేసుకోలేం: హైకోర్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని