కరోనా బాధితుడు ఏమయ్యాడు!
జిల్లా కొవిడ్ ఆస్పత్రి-2(రుయా) లో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 6.40కి చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో
●ఆస్పత్రి.. మార్చురీలోనూ కనిపించని వైనం
●చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం
తిరుపతి(వైద్యం): జిల్లా కొవిడ్ ఆస్పత్రి-2(రుయా) లో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 6.40కి చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో కడచూపు కోసం ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని చూపించకపోవడంతో మార్చురీలోకి వెళ్లి చూసినా కన్పించలేదు. ఆస్పత్రిలో లేక, మార్చురీలో లేక ఏమయ్యాడని కుటుంబసభ్యులు అధికారులను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలానికి చెందిన మాజీ సర్పంచి(49) తీవ్ర దగ్గు, ఆయాసంతో తిరుపతి రుయా అత్యవసర విభాగానికి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని పరీక్ష చేశారు. పాజిటివ్ రావడంతో ఆ రాత్రి కొవిడ్ ఆస్పత్రిలోకి మార్చారు. రెండు మూడు రోజుల వరకు కుటుంబ సభ్యులతో చరవాణిలో మాట్లాడారు. ఆదివారం నుంచి చరవాణి స్విచ్చాఫ్లో ఉంది. ఏమయ్యాడనే భయాందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం చనిపోయాడనే సమాచారం అందింది. భార్య, పిల్లలు చివరి చూపు కోసం ఆస్పత్రి వద్దకు వచ్చారు. గోవిందధామానికి తీసుకెళ్లేటప్పుడు ముఖం చూపిస్తామని, మార్చురీ వద్ద ఉండమని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకురాలేదు. చివరకు లోపలకు వెళ్లగా ఆ బాధితుడి మృతదేహం లేదని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో కలసి మార్చురీలో పరిశీలించి మృత దేహం లేనట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కొవిడ్ ఆస్పత్రిలోకి వెళ్లి పరిశీలించారు.
వివరాలు తప్పుగా రాసి..
అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇతని పక్క పడకలో ఉన్న కరోనా బాధితుడు చనిపోతే.. ఆ వివరాలు ఇతని కేసష్ీట్లో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా నమోదు చేసినట్లు గుర్తించారు. చనిపోయిన బాధితుడి మృతదేహం మార్చురీలో ఉంది. అయితే 49 ఏళ్ల బాధితుడు ఏమయ్యాడంటూ ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో పరిశీలించారు. అతని పడక వద్ద చరవాణి ఛార్జర్, సంచి ఉండటాన్ని గుర్తించారు. సోమవారం ఉదయం ఆస్పత్రి బయట నిలబడి ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెప్పినట్లు తెలిసింది. కొవిడ్ ఆస్పత్రిలో లేకుండా ఎక్కడికెళ్లాడో తేల్చాలని కుటుంబ సభ్యులు ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!