Tirumala: తిరుమలలో మరోసారి డ్రోన్‌ కలకలం.. అదుపులో ఇద్దరు భక్తులు

తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది.

Updated : 12 Jan 2024 16:19 IST

తిరుమల: తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అస్సాంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్‌తో చిత్రీకరిస్తుండగా.. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఉపయోగించేందుకు అనుమతి లేదు. భక్తుల వాహనాలను అలిపిరి చెక్‌పోస్టు వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. కానీ, అధికారుల కళ్లు గప్పి ఇద్దరు భక్తులు వారితో పాటు డ్రోన్‌ తీసుకురావడం, మోకాళ్ల పర్వతం ప్రాంతంలో దాన్ని వినియోగించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన తితిదే విజిలెన్స్‌ అధికారులు అస్సాం వాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు